ఫ్యూచర్ థియేటర్లదే… నిర్మాతలూ ఓటీటీ బాట పట్టకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు. తాను కూడా ఓ నిర్మాతనేనని, అయితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరంగా ఉన్న ఈ సమయంలో నిర్మాతలు సైతం సంయమనం పాటించాలని, ఎగ్జిబిటర్స్ కష్టాలను గుర్తించాలని కోరారు.
తెలంగాణలో 600, ఆంధ్రప్రదేశ్లో 1100 థియేటర్లు ఉన్నాయని, మొన్నటి వరకూ ఆ థియేటర్ల నుండి ఆదాయాన్ని పొందిన నిర్మాతలు ఇప్పుడు కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీ దారి పట్టడం కరెక్ట్ కాదని విజయేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి క్వాలిటీ సౌండ్ తో, సౌకర్యవంతంగా సినిమాలను థియేటర్లలో చూస్తే లభించే తృప్తి వేరని, అది ఓటీటీలో చూడటం వల్ల దక్కదని, అందువల్లే ఇటీవల ఓటీటీలో వచ్చిన పెద్ద చిత్రాలకు ఆదరణ కరువైందని ఆయన అభిప్రాయ పడ్డారు. థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలోనూ, శాటిలైట్ ఛానెల్స్ లోనూ ప్రసారం చేసుకుంటే… నిర్మాతకే అదనపు లాభాలు దక్కుతాయని, వాటిని కాదని ఓటీటీని ఎంచుకుంటే… రాబోయే రోజుల్లో తమ నిర్ణయాలు సైతం తీవ్రంగా ఉండే ఆస్కారముందని కొందరు సభ్యులు సుతిమెత్తగా హెచ్చరించారు. మరి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ తీర్మానం పట్ల మన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!