ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక అందచేశారు. ఈ రోజు ఉదయం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణంను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి స్వామివారికి అందించారు దాసరి కిరణ్ కుమార్. గతంలో పలు చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్ త్వరలోనే వరుసగా సినిమాలను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
