ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. దాపు 15 రోజులు తన కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తన కుటుంబాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా తన టీంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సొంత ఖర్చులతో వ్యాక్సిన్ వేయించారు. ఆలా దాదాపు 135 మందికి సొంత ఖర్చులతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేయించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ మినీ వ్యాక్సిన్ డ్రైవ్ ను పర్సనల్ గా చూసుకున్నారట. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గ నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.