Ys Sharmila: వైఎస్సార్ సంక్షేమ పాలనే ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా వుందన్నారు.
Read Also: KTR: బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్
Also Read
బ్రతుకు దెరువు గా ఉన్న భూమినిలాక్కునే హక్కు కేసీఆర్ కి ఎక్కడిదన్నారు. మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టిన ఘనుడు కేసీఆర్. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు..బండ అని మండిపడ్డారు. ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. కేసీఆర్ వైఖరి తాలిబన్లను తలపిస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలన లో వ్యవసాయం ఒక శాపంగా మారిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే నా ఆరాటం అని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల.
తాజావార్తలు
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!