Ys Sharmila: వైఎస్సార్ సంక్షేమ పాలనే ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం చర్చ్ రాం పెడ్ గ్రామంలో రైతు గోస మహా ధర్నా లో పాల్గొన్నారు వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ హయాంలో 3లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పేదలకు ఇంకా 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చే వారన్నారు. వైఎస్సార్ తర్వాత తెలంగాణలో ఒక్క ఎకరాకి పట్టా ఇవ్వలేదు. కుర్చీలేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడంటూ రైతు గోస సభలో షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా వుందన్నారు.
Read Also: KTR: బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్
Also Read
బ్రతుకు దెరువు గా ఉన్న భూమినిలాక్కునే హక్కు కేసీఆర్ కి ఎక్కడిదన్నారు. మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టిన ఘనుడు కేసీఆర్. కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు..బండ అని మండిపడ్డారు. ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. కేసీఆర్ వైఖరి తాలిబన్లను తలపిస్తోంది. బంగారు తెలంగాణ కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలన లో వ్యవసాయం ఒక శాపంగా మారిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే నా ఆరాటం అని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!