వైఎస్ షర్మిల ఆరో రోజు పాదయాత్ర.. కేసీఆర్ పాలనపై విమర్శల బాణాలు
రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలున్నాయిని తాను నిరూపిస్తే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడ్ని సీఎం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి సమస్యలు లేకపోతే నేను ముక్కు రాసి ఇంటికి వెళ్ళి పోతానని.. దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. బంగారు తెలంగాణలో బడి పిల్లలు టాయిలెట్ పరిస్థితి ఇది.. సిగ్గు సిగ్గు..ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి..పరిపాలన చాతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకోవాలన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ఇద్దరే కారణమన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు షర్మిల.
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 6వ రోజుకి చేరుకుంది. మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు నుంచి ప్రారంభమైంది పాదయాత్ర. తుమ్మలూరులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. మొహబత్ నగర్ క్రాస్ తుమ్మలూరు గేట్ – రాచలూరు గేట్ మీదుగా పాదయాత్ర సాగింది.
అనంతరం కందుకూర్ మండలం బైరాగిగూడ లేముర్ క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది. లేముర్ గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అగరమియాగూడ గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు వైఎస్ షర్మిల.మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. 3:30 గంటలకు లేమూర్ క్రాస్కు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.
తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం నాటికి పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోమొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల కోసం పనిచేస్తున్నాయి. ఐదవ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!