Y. S. Sharmila:రైతులదే తప్పని చెప్తున్నారా? వైఎస్ షర్మిళ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా? అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. పంట లేటుగా వేస్తే.. గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెపుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు…. వరి వేస్తె ఉరే అని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? అని అన్నారు.
వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు? అని సెటైర్ వేశారు. ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారు? రని ఎద్దేవ చేశారు. కాంటాలు పెట్టడం, టార్పాలిన్ కవరు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ… పంటలు లేట్ గా వేసుకొన్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసె పరిస్థితి వచ్చింది అని రైతులదే తప్పని చెప్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు పండించినందుకు రైతును దొషిని చేస్తున్నారా? అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు వై.ఎస్. షర్మిళ.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
పంట లేటుగా వేస్తే,గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు,
వరి వేస్తే ఉరేనని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు?
కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే 1/2— YS Sharmila (@realyssharmila) May 18, 2022
అయితే.. వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. 17 మే 2022 (మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. సకాలంలో వరిపంట వేసుకుంటే అకాల వర్షాలతో నష్టాలు వచ్చేవి కావన్నారు. నవంబర్ లోనే సాగు ప్రారంభించిన రైతులు ఏప్రిల్ లోనే వరికోతలు పూర్తి చేసుకున్నారన్నారు. దీంతో ఎలాంటి నష్టంలేకుండా రైతులు లాభాలు పొందారని తెలిపారు.
ఎప్పుడైనా మే నెలలో అకాల వర్షాలు పడుతుంటాయని.. రాళ్ల వానలతో పంట నష్టం జరుగుతుందన్నారు. ఈదురుగాలులతో వచ్చే వర్షాలతో మామిడి తోటలు దెబ్బతింటాయన్నారు. కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పంటలు వేయడంతో అకాల వర్షాలకు నష్టాలపాలవుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. వర్షాలను ఏమైనా సీఎం కేసీఆర్ చేయిపెట్టి ఆపగలరా అన్నారు. రాళ్లవానను ఆపగలరా.. ఈదురుగాలులతో వచ్చే వర్షాన్ని సీఎం కేసీఆర్ ఆపగలరా అని చెప్పుకొచ్చారు. 15 రోజులు ముందు వరిపంట వేస్కుంటే ఎలాంటి నష్టం ఉండదని.. లాభాలతో తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.
Big Breaking: రాజీవ్ గాంధీ హత్య కేసు.. సుప్రీం సంచలన తీర్పు
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!