Y. S. Sharmila:రైతులదే తప్పని చెప్తున్నారా? వైఎస్ షర్మిళ కౌంటర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా? అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. పంట లేటుగా వేస్తే.. గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెపుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు…. వరి వేస్తె ఉరే అని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? అని అన్నారు.
వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు? అని సెటైర్ వేశారు. ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారు? రని ఎద్దేవ చేశారు. కాంటాలు పెట్టడం, టార్పాలిన్ కవరు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ… పంటలు లేట్ గా వేసుకొన్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసె పరిస్థితి వచ్చింది అని రైతులదే తప్పని చెప్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు పండించినందుకు రైతును దొషిని చేస్తున్నారా? అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు వై.ఎస్. షర్మిళ.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
పంట లేటుగా వేస్తే,గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు,
వరి వేస్తే ఉరేనని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు?
కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే 1/2— YS Sharmila (@realyssharmila) May 18, 2022
అయితే.. వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. 17 మే 2022 (మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. సకాలంలో వరిపంట వేసుకుంటే అకాల వర్షాలతో నష్టాలు వచ్చేవి కావన్నారు. నవంబర్ లోనే సాగు ప్రారంభించిన రైతులు ఏప్రిల్ లోనే వరికోతలు పూర్తి చేసుకున్నారన్నారు. దీంతో ఎలాంటి నష్టంలేకుండా రైతులు లాభాలు పొందారని తెలిపారు.
ఎప్పుడైనా మే నెలలో అకాల వర్షాలు పడుతుంటాయని.. రాళ్ల వానలతో పంట నష్టం జరుగుతుందన్నారు. ఈదురుగాలులతో వచ్చే వర్షాలతో మామిడి తోటలు దెబ్బతింటాయన్నారు. కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పంటలు వేయడంతో అకాల వర్షాలకు నష్టాలపాలవుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. వర్షాలను ఏమైనా సీఎం కేసీఆర్ చేయిపెట్టి ఆపగలరా అన్నారు. రాళ్లవానను ఆపగలరా.. ఈదురుగాలులతో వచ్చే వర్షాన్ని సీఎం కేసీఆర్ ఆపగలరా అని చెప్పుకొచ్చారు. 15 రోజులు ముందు వరిపంట వేస్కుంటే ఎలాంటి నష్టం ఉండదని.. లాభాలతో తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.
Big Breaking: రాజీవ్ గాంధీ హత్య కేసు.. సుప్రీం సంచలన తీర్పు
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!