YS Sharmila: కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట అబద్ధమే.. ప్రతి పథకం మోసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Again Makes Shocking Comments On CM KCR: ఇచ్చిన ప్రతి మాట అబద్ధమే, ప్రతి పథకం మోసమేనంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాన్చెరు నియోజక వర్గంలో జిన్నారంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్సార్ చేసిన ఐదేళ్ల పాలన ఓ అద్భుతమని తెలిపారు. ఐదేళ్లలో ఆయన ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదని, అన్ని సంక్షేమ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి & పరిపాలన ఉండాలంటే.. అది వైఎస్సార్లా ఉండాలన్నారు. మరి, కేసీఆర్ అలా ఉన్నాడా? ఎనిమిదేళ్ల పాలనలో ఏమైనా ఇచ్చాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తన జన్మలో ఇచ్చిన ఒక్క మాటని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని షర్మిల ఎద్దేవా చేశారు. పటాన్చెరు నియోజక వర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఔటర్ రింగ్రోడ్ కడితే.. ఈ నియోజక వర్గం రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్కి సంబంధం లేదన్నట్లుగా ఉండే ఈ ప్రాంతం.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, లక్షల్లో ఉన్న భూముల విలువ కోట్లకు పడగలెత్తాయని అన్నారు. వైఎస్సార్ తీసుకొచ్చిన కొత్త పాలసీ పుణ్యమా అని.. వెళ్లిపోతున్న పరిశ్రమలు ఇక్కడే ఉండిపోవడంతో పాటు సరికొత్త పరిశ్రమలు వచ్చాయని, దాంతో వేలాదిమందికి ఉపాధి దొరికిందని అన్నారు. తెల్లాపూర్లో ఐటీ పార్క్తో పాటు 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. మరి, కేసీఆర్ ఈ నియోజక వర్గానికి ఏం తెచ్చారు? అని నిలదీశారు. మెట్రో రైలు తీసుకువస్తానని కేటీఆర్ అన్నాడు.. కానీ ఇవ్వలేదు. కాలుష్య జలాలు శుద్ది చెసే ప్లాంట్ అన్నారు.. అది కూడా తీసుకురాలేదన్నారు.
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
చివరికి.. ఎమ్మెల్యేలు సైతం పటాన్చెరు నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. మూడు కబ్జాలు, ఆరు కమీషన్లలతో చక్కగా సంపాదించుకుంటున్నారే తప్ప.. ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. ఇది దోపిడీ రాజ్యమని.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు, సంపాదనే ఇక్కడి ఎమ్మెల్యేల ధ్యేయమని ఆరోపించారు. దళితులకు దళిత బందు అని చెప్పి నిండా ముంచేశారన్నారు. దళితులు రాష్ట్రంలో 20 వేల మంది ఉన్నారని.. మరి వారికి ఈ పథకం ఇచ్చారా? అని నిలదీశారు. దళిత బందు లాగే గిరిజిన బందు, రేపు బీసీ బందు, ఎల్లుండి ఆకాశంలో చందమామ కూడా తెస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తేనే ఈ కొత్త హామీలని.. ఓట్లు వేయించుకున్నా తిరిగి వెళ్లిపోవడమే వాళ్లకి తెలుసని వ్యాఖ్యానించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్తున్న కేసీఆర్.. మరి ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ప్రక్రియ వస్తుందని.. దాన్ని ఆపడానికే గిరిజన జీవో అని, ఇది ఒక ఎత్తుగడ అని చెప్పారు.
తెలంగాణ లో ఏ వర్గాన్ని ఆదుకోవడం చేతకాదన్నారు. బతుకమ్మ చీరలు అన్నగా, తండ్రిగా కేసీఆర్ ఇస్తున్న డబ్బులని ప్రచారం చేసుకుంటున్నారని.. ఆ డబ్బులు మీ ఇంట్లోవా? ఢిల్లీ లిక్కర్ స్కాంకి చెందినవా? ఫీనిక్స్ కంపెనీ నుంచి తెచ్చారా? కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులతో ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగాయన్నట్టు.. కేటీఆర్కు బాసర వెళ్లడానికి ఇప్పుడు తీరిక కుదిరిందా? అక్కడి సమస్యలు ఇప్పుడు కనిపించాయా? అని నిలదీశారు.
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!