Couple Arrested: ఘరానా దంపతులు.. నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన భర్తకు సపోర్టుగా భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Arrested: బడా వ్యాపారవేత్తగా బిల్డప్ ఇస్తూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా పెళ్లికి యత్నిస్తున్న ఘరానా జంటను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యెలిగంటి రంజిత్ అలియాస్ రాధాకృష్ణ అలియాస్ రాకేష్, సంధ్య దంపతులు. ఉప్పల్ పరిధిలోని ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 2022లో వారి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ.. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లను తనిఖీ చేశాడు. ఆ సమయంలో చాలా మంది యువతులు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ప్రొఫైల్స్ అప్లోడ్ చేయడం గమనించాడు. దీంతో నిత్య పెళ్లి కొడుకుగా అవతారమెత్తాడు. యాప్లో ప్రొఫైల్ చూసి పెళ్లికి సిద్ధమయ్యాక.. నేను ఫలానా దగ్గర పని చేస్తున్నా.. నీ జీతం ఎంత.. నేను బిల్డర్ని, నా వెంచర్ ఓ రేంజ్ లో నడుస్తోంది.. నేను చాలా ధనవంతుడిని అంటూ యువతులను పరిచయం చేసుకున్నాడు. అతని భార్య కూడా సహకరించి పరిస్థితిని బట్టి వేషం మార్చుకుంటూ వచ్చింది.
Read also: Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
అతడిపై యువతులకు నమ్మకం కుదరగానే.. ఆ తర్వాత తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని.. కట్నం డబ్బుల్లోంచి కట్ చేసుకోవచ్చని చెప్పి నమ్మించడం స్టార్ట్ చేస్తాడు. దీంతో ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. అంతే వ్యవహారంలో భర్తకు భార్యకూడ తోడు ఉండటం వలన కొద్ది రోజులు వీరి భాగోతం అలా సాగింది. ఈ ఘటనపై కొందరు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ భిక్షపతి నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులు లక్షల్లో మోసపోయినట్లు విచారణలో తేలింది. షాదీ.కామ్, ఇతర మ్యాట్రిమోనియల్ సైట్లలో వివాహ సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు, వారి ప్రొఫైల్ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ జంట ఎవరైనా మోసపోయినట్లయితే, వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!