Y.S. Sharmila: టీఆర్ఎస్ తాగుబోతులు, రేపిస్టుల పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు.
కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో మంచి నీళ్లు కూడా దిక్కలేవని.. బడులు, గుడులు ఎన్ని ఉన్నాయో బార్లు, వైన్స్ కూడా అన్నే ఉన్నాయని ఆరోపించారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ మద్యం వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం రాబడితో రాష్ట్రాన్ని నడుపుతున్నాడని.. బాలికలకు కేసీఆర్ పాలనలో రక్షణ లేదని విమర్శించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తుంది టీఆర్ఎస్ నేతల కొడుకులు, మనవళ్లు అంటూ ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ హత్యాచారాలు, తాగుబోతులు, రేపిస్టుల పార్టీ అని విమర్శించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే సీఎం గాడిదలను కాస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు లేవని అడిగారు. ప్రభుత్వం మనదే ఇష్టం వచ్చినట్లు చేసుకోండని సీఎం ధైర్య ఇస్తున్నారని.. పనికోసం, సహాయం కోసం వెళ్తే ఆడవాళ్ల మాన ప్రాణాలను అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. మన దరిద్రం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. ఆయన పాలనలో పేదలకు గౌరవం లేదని ఆరోపించారు. ఈ దరిద్రం సరిపోదు అన్నట్లుగా దేశాన్ని ఏలుతాడా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడిందని విమర్శించారు.
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేని తెలంగాణగా మార్చాడని విమర్శించారు. రూ.800 కోట్లు టీఆర్ఎస్ అకౌంట్లో ఉంటే బంగారు తెలంగాణ ఎవరికి అయిందని ప్రశ్నించారు. దొంగోడికి తాళం ఇస్తే మొత్తం దోచుకుపోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని..కమీషన్ల రూపంలో తెచ్చిన అప్పులు కేసీఆర్ ఇంట్లోకి పోయాయని ఆరోపించారు. మాట ఇచ్చి మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డ గా చెప్తున్న.. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇక నమ్మింది, మోసపోయింది చాలని ఆమె ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!