Y.S. Sharmila: టీఆర్ఎస్ తాగుబోతులు, రేపిస్టుల పార్టీ
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు.
కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో మంచి నీళ్లు కూడా దిక్కలేవని.. బడులు, గుడులు ఎన్ని ఉన్నాయో బార్లు, వైన్స్ కూడా అన్నే ఉన్నాయని ఆరోపించారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ మద్యం వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం రాబడితో రాష్ట్రాన్ని నడుపుతున్నాడని.. బాలికలకు కేసీఆర్ పాలనలో రక్షణ లేదని విమర్శించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తుంది టీఆర్ఎస్ నేతల కొడుకులు, మనవళ్లు అంటూ ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ హత్యాచారాలు, తాగుబోతులు, రేపిస్టుల పార్టీ అని విమర్శించారు.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే సీఎం గాడిదలను కాస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు లేవని అడిగారు. ప్రభుత్వం మనదే ఇష్టం వచ్చినట్లు చేసుకోండని సీఎం ధైర్య ఇస్తున్నారని.. పనికోసం, సహాయం కోసం వెళ్తే ఆడవాళ్ల మాన ప్రాణాలను అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. మన దరిద్రం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. ఆయన పాలనలో పేదలకు గౌరవం లేదని ఆరోపించారు. ఈ దరిద్రం సరిపోదు అన్నట్లుగా దేశాన్ని ఏలుతాడా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడిందని విమర్శించారు.
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేని తెలంగాణగా మార్చాడని విమర్శించారు. రూ.800 కోట్లు టీఆర్ఎస్ అకౌంట్లో ఉంటే బంగారు తెలంగాణ ఎవరికి అయిందని ప్రశ్నించారు. దొంగోడికి తాళం ఇస్తే మొత్తం దోచుకుపోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని..కమీషన్ల రూపంలో తెచ్చిన అప్పులు కేసీఆర్ ఇంట్లోకి పోయాయని ఆరోపించారు. మాట ఇచ్చి మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డ గా చెప్తున్న.. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇక నమ్మింది, మోసపోయింది చాలని ఆమె ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?