Husband Murder: ప్రియుడి మోజులో భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. ఆ తరువాత దొరక్కుండా డెడ్బాడీని హైదరాబాద్కు తీసుకొచ్చి పాతిపెట్టింది. పోలీసులు రంగంలోకి దిగడంతో సుపారీ పెళ్లాం గుట్టు రట్టయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. వనప్తరి జిల్లాలో కట్టుకున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి చంపేసింది. గాంధీ నగర్కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వీరి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం సంతోషంగానే సాగిపోతోంది. ఇదే సమయంలో నవీన్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ప్రియుడితో చెక్కేయాలనుకున్న లావణ్య.. భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి కోడిపుంజును కోసి రావాలని భార్య చెప్పడంతో బాలస్వామి నమ్మేశాడు. అక్కడికి వచ్చిన బాలస్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిపి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టారు.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
లావణ్య కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా వనపర్తి శివారులో ఆమెను పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా అదువులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. విచారణలో శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో కనుక్కుని.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?