Husband Murder: ప్రియుడి మోజులో భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. ఆ తరువాత దొరక్కుండా డెడ్బాడీని హైదరాబాద్కు తీసుకొచ్చి పాతిపెట్టింది. పోలీసులు రంగంలోకి దిగడంతో సుపారీ పెళ్లాం గుట్టు రట్టయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. వనప్తరి జిల్లాలో కట్టుకున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి చంపేసింది. గాంధీ నగర్కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వీరి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం సంతోషంగానే సాగిపోతోంది. ఇదే సమయంలో నవీన్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ప్రియుడితో చెక్కేయాలనుకున్న లావణ్య.. భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి కోడిపుంజును కోసి రావాలని భార్య చెప్పడంతో బాలస్వామి నమ్మేశాడు. అక్కడికి వచ్చిన బాలస్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిపి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టారు.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
లావణ్య కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా వనపర్తి శివారులో ఆమెను పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా అదువులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. విచారణలో శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో కనుక్కుని.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?