Husband Murder: ప్రియుడి మోజులో భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. ఆ తరువాత దొరక్కుండా డెడ్బాడీని హైదరాబాద్కు తీసుకొచ్చి పాతిపెట్టింది. పోలీసులు రంగంలోకి దిగడంతో సుపారీ పెళ్లాం గుట్టు రట్టయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. వనప్తరి జిల్లాలో కట్టుకున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి చంపేసింది. గాంధీ నగర్కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వీరి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం సంతోషంగానే సాగిపోతోంది. ఇదే సమయంలో నవీన్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ప్రియుడితో చెక్కేయాలనుకున్న లావణ్య.. భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి కోడిపుంజును కోసి రావాలని భార్య చెప్పడంతో బాలస్వామి నమ్మేశాడు. అక్కడికి వచ్చిన బాలస్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిపి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టారు.
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
లావణ్య కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా వనపర్తి శివారులో ఆమెను పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా అదువులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. విచారణలో శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో కనుక్కుని.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తాజావార్తలు
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!