Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet: సిద్దిపేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త హిజ్రాగా మారి వేధిస్తుండటంతో భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది.. గత నెలలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. 2014లో సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీ అనే మహిళకు నసరపుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో వివాహమైంది. వారికి ఒక పాప ఉంది. వెంకటేష్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కానీ వెంకటేష్ ప్రవర్తనలో క్రమంగా మార్పు రావడంతో హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. గత ఏడేళ్లుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే తన కూతురిని తనకు అప్పగించాలంటూ వేదశ్రీని రోజా వేధించేది. దీంతో కొంతకాలంగా సన్నిహితంగా మెలిగిన సిద్దిపేటకు చెందిన బోయిని రమేష్ తో కలిసి రోజాను హత్య చేయాలని వేదశ్రీ నిర్ణయించుకుంది. బోయిని రమేష్తో వేదశ్రీ హత్యకు ప్లాన్ చేసింది.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోగా రెండు విడతలుగా రూ.4.60 లక్షలు చెల్లించింది. గతేడాది డిసెంబర్ 11న నసర్పురాలోని తన ఇంట్లో రోజా ఒంటరిగా హత్యకు గురైంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేష్ స్నేహితుడు ఇప్పల శేఖర్ రోజాతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అన్ని కోణాల్లో విచారించగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయింది. శనివారం సిద్దిపేట వన్టౌన్ పోలీసులు నిందితురాలు వేదశ్రీతో పాటు ముగ్గురిని రిమాండ్కు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేష్, ఇప్పల శేఖర్లను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Top Headlines @ 9AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!