Hyderabad: సాఫీగా సాగిపోతున్న జీవితాలను వివాహేతర సంబంధాలు నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల పవిత్ర బంధంపై అక్రమ సంబంధం పైచేయి సాధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. బాయ్ఫ్రెండ్స్ కోసం భర్తను చంపేందుకు పిల్లలను వదిలించుకోవడానికి కొందరు మహిళలు ఎంతగా దిగజారేందుకు వెనుకాడటం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్య ప్రియుడి మోజులోపడి భర్తనే కడతేర్చింది. భార్యాభర్తల బంధానికి మచ్చలాంటి ఈ ఘటన హైదరాబాద్ శివారులో వెలుగు చూసింది.
Read also: Manipur: మణిపూర్ మహిళలతో అసభ్య ప్రవర్తన.. నిందితుడి ఇంటికి నిప్పు
హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. తుక్కప్ప కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ మంచాన పడ్డాడు. దీంతో అతని భార్య ఈశ్వరమ్మ అదే కాలనీలో ఉంటున్న శ్రీనివాస్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా కాలంగా కొనసాగుతున్న వీరి అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా వుండగా ఈశ్వరమ్మ, శ్రీనివాస్ లను రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో తుక్కప్ప, ఈశ్వరమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈశ్వరమ్మకు తుక్కప్ప మరోసారి ఇలా జరిగితే బాగుండదని హెచ్చరించాడు. దీంతో ఈశ్వరమ్మ ఆగ్రహానికి లోనైంది. తుక్కప్పను హతమార్చాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. అనారోగ్యంతో వున్న తుక్కప్పను మద్యంలో విషం కలిపి ఇచ్చింది.
Read also: Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!
అదిగమనించిని తుక్కప్ప మందును తాగి కిందకు పడిపోయాడు. దీంతో ఈశ్వరమ్మ ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యింది. తుక్కప్పను గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న తుక్కప్పను గుర్తించిన ఘట్ కేసర్ పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తుక్కప్ప మృతి చెందిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మ కనిపించకపోవడంతో ఈ పని చేసి ఉంటుందని అనుమానం బలపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న(గురువారం) ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు శ్రీనివాస్లను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.
Rangareddy: నవీన్ స్టోరీ మళ్లీ రిపీట్.. ప్రియురాలి కోసం స్నేహితున్ని చంపేశాడు