P2 to G2′ అంటే ఏంటి?.. మోడీ చెప్పిన మోడల్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పార్టీ అగ్ర నేత, ప్రధాని మోడీ తన ప్రసంగంలో ‘P2 to G2’ అనే మోడల్ గురించి ప్రస్తావించారు. ఈ మోడల్ని దేశం మొత్తం పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో నరేంద్ర మోడీ పేర్కొన్న ఈ నమూనాకి ఫుల్ఫాం ఏంటనేది ఆస్తకికరంగా మారింది. అందుకే ఇప్పుడు దాని గురించి చెప్పుకోబోతున్నాం. P2ని (రెండు Pలని) ప్రొ-పీపుల్ పాలసీస్ అని, G2ని(రెండు Gలని) గుడ్ గవర్నెన్స్ అని విశదీకరించొచ్చు.
Read Also: Minister Roja: భీమ్లానాయక్ బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు..!
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రొ-పీపుల్ పాలసీస్ అంటే ప్రజానుకూల విధానాలని, గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన అని అర్థం. నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి జనాలు, పార్టీ కార్యకర్తలు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని, అలా చేసినప్పుడే ప్రజానుకూల విధానాలను రూపొందించగలమని, సుపరిపాలన అందించగలమని ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ నేతలు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రెండు రోజులు వెళ్లి అక్కడే గడిపారని, ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాల్లోనూ పాటిస్తే పార్టీకి ప్రయోజం కలుగుతుందన్నారు. నాయకులు జాగ్రత్తగా మసలుకోవాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని చెప్పారు.
“సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయటం ద్వారా ‘వన్ ఇండియా’ని సాధించారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు వన్ కంట్రీ అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపైన ఉంది. తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులు ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దేశంలో కుటుంబ పార్టీల పాలనకు కాలం చెల్లింది. అయితే ఆయా పార్టీలను అవమానించకుండా, వాటి లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి” అని ప్రధాని మోడీ ఉద్భోదించారు.
తాజావార్తలు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!