Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు ఈ జిల్లాల్లో వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది బుధవారం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు, మంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 83గా నమోదైంది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
Read also: Telangana Election 2023: రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు.. రోడ్ షోలు.. వివరాలు ఇవే..
ఈరోజు ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ట్రోపోస్పియర్లో తూర్పుగాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, మలక్కా జలసంధి పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది. ఇది 29 నవంబర్ 2023 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతుందని, రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయంలో తుపాను బలపడే అవకాశం ఉందన్నారు. ఏపీ, యానాంలోని ట్రోపోస్పియర్లో తూర్పు, ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపారు.
Hyderabad: ఎన్నికల వేళ ర్యాపిడో సంస్థ బంపర్ ఆఫర్.. ఆరోజు వారందరికీ ఫ్రీ రైడ్
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!