Hussain Sagar: సాగర్లోకి మురుగు నీరు.. జలావరణానికి ప్రమాదముంటున్న పీసీబీ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hussain Sagar: హైదరాబాద్ మహా నగరంలోని పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోంది. వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో మురుగు నీరు స్వేచ్చగా కలిసిపోయి నీరు కలుషితంగా మారిపోతోంది. ఇటీవల పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ విడుదల చేసిన నివేదికలోనూ అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల హుస్సేన్ సాగర్లో జీవనం ప్రమాదంలో పడిందని తేలింది. కాగా.. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా.. నీటి నాణ్యత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహానగరంలో నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లో మురుగునీరు స్వేచ్చగా ప్రవహించడంతో నీటి నాణ్యత క్షీణిస్తోంది. దీనికి తోడు బంజారా నాలా ద్వారా విడుదలయ్యే శుద్ధి చేయని డ్రైనేజీ నీరు, మురుగులో ఉండే కాలుష్య కారకాలు, మెటాలిక్ సమ్మేళనాలు కారణంగా రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటుంది. 2023లో తయారు చేసిన పీసీబీ నివేదిక ప్రకారం.. హుస్సేన్ సాగర్కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత అధ్వాన్నంగా ఉంది.
Read also: Srisailam: శ్రీశైలంలో ఆర్జిత సేవలన్నీరద్దు.. ఎప్పటి నుంచి అంటే..!
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
ప్రధానంగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తో పాటు సాలిడ్ వేస్ట్, కోలిఫాం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, నీటి pH స్థాయి 6.63-7.63 మధ్య స్థిరంగా ఉండగా, అధిక విద్యుత్ వాహకత (EC) విలువ నీటిలోని ఖనిజ లవణాలకు విలక్షణమైనది, PCB వర్గాలు వెల్లడించాయి. పిసిబి వర్గాల ప్రకారం, నీటి నాణ్యత క్రమంగా క్షీణించడానికి ప్రధాన కారణాలు శుద్ధి చేయని మురుగునీరు మరియు మానవ వ్యర్థాల పరిమాణం. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే నీటి పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగునీటితోనే హుస్సేన్ సాగర్ లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ జలాలను కాపాడాలంటే సమర్థవంతమైన ఎస్టీపీలతో పాటు, నిరంతరం ప్రవహించే మంచినీరు లేదా 100 శాతం శుద్ధి చేసిన మురుగునీటితో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా.. వీటితో పాటు ప్రతి సంవత్సరం వేసవిలో నీరు ఆవిరైపోతుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
TSPSC Group 2024: గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!