Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్.. కొత్తగూడెంలో భారీ ఎన్కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ప్రజాప్రతినిధులకు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపారు. జగిత్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో రాసిన లేఖలు పోస్టులో వచ్చాయి. జిల్లాలోని బీర్పూర్ మండల సర్పంచ్లు, ఎంపీపీ, నరసింహుల పల్లి ఎంపీటీసీలతో పాటు పలువురు కీలక నేతలు మావోయిస్టుల పేరుతో మొత్తం 28 మందికి ఈ లేఖలు రాశారు. అయితే మండలంలో కొందరు నాయకులు అటవీ భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాకోర్టులో దండం పెట్టి చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. లెటర్ హెడ్స్పై జగదల్పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించారు. ఈ లేఖలను గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్కు పంపారు. అయితే రాజకీయ నాయకులతో పాటు మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖలు అందాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అయితే.. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఈ భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, పోలీసులెవరూ గాయపడలేదు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇలాంటి సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు చనిపోతున్నారు. అలాగే, కొన్నిసార్లు పోలీసులు కూడా ఈ కాల్పుల్లో మరణిస్తారు.
KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
Also Read
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!