Warangal : భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీశ్రావును అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. నిత్యం కార్మికుల మధ్య ఉంటూ శ్రమజీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్ అని కొనియాడారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కనీసం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదన్నారు. గ్యాస్ ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలను కొంటున్నారని తెలిపారు. కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏడాదిలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హరీశ్రావు వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
Asani Cyclone: తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ, చెన్నైలకు విమానాలు రద్దు
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!