Tiger in Warangal: నర్సంపేటలో పులి సంచారం.. భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు..
- నర్సంపేటలో పులి సంచారంతో భయాందోళనలో ప్రజలు..
- పాకాల అభయ అరణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారణ..
- చెక్ పోస్ట్ వద్ద వాహనాల నియంత్రణకు చర్యలు..
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger in Warangal: వరంగల్ జిల్లాలో పులి సంచరిస్తోందన్న వార్త ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ లోకి ప్రవేశించిన పెద్దపులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల అభయ అరణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీపంలోని అడవిలో పులి సంచరించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Rangareddy Crime: రంగారెడ్డిలో దారుణం.. రూ.500 కోసం దారుణ హత్య..
Also Read
- Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
అనంతరం ఖానాపురం మండలంలోనూ పులి సంచరిస్తోందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. నర్సంపేట మండల పరిధిలోకి ఆదివారం పెద్దపులి వచ్చిందని తెలియడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే గొర్రెల కాపరులు కొద్దిరోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మేపాలని నర్సంపేట ఇన్ స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి త్వరగా పనులు ముగించుకుని సాయంత్రంలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు.
Read also: Astrology: డిసెంబర్ 30, సోమవారం దినఫలాలు
నల్లబెల్లి మండలంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి.. రుద్రగూడెం, కొండాయిపల్లి శివారులోని పలుగు ఈనే (కొండవాలు ప్రాంతం) నుంచి అటవీ బాట పట్టింది. పులి పాదముద్రల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నర్సంపేట ఎఫ్ ఆర్ ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరా సాయంతో పలుగు ఈనె ప్రాంతాన్ని చిత్రీకరించి పరిశీలించారు. ఇక్కడే పులి చనిపోయిందని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఇంతలో పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తేలడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!