Tiger in Warangal: నర్సంపేటలో పులి సంచారం.. భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు..
- నర్సంపేటలో పులి సంచారంతో భయాందోళనలో ప్రజలు..
- పాకాల అభయ అరణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారణ..
- చెక్ పోస్ట్ వద్ద వాహనాల నియంత్రణకు చర్యలు..
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు..
Tiger in Warangal: వరంగల్ జిల్లాలో పులి సంచరిస్తోందన్న వార్త ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ లోకి ప్రవేశించిన పెద్దపులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల అభయ అరణ్యంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీపంలోని అడవిలో పులి సంచరించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Rangareddy Crime: రంగారెడ్డిలో దారుణం.. రూ.500 కోసం దారుణ హత్య..
Also Read
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
- Warangal Rocket Launch : తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.! ఆకాశంలోకి దూసుకెళ్లనున్న 'రుద్రమ' రాకెట్..
అనంతరం ఖానాపురం మండలంలోనూ పులి సంచరిస్తోందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. నర్సంపేట మండల పరిధిలోకి ఆదివారం పెద్దపులి వచ్చిందని తెలియడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే గొర్రెల కాపరులు కొద్దిరోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మేపాలని నర్సంపేట ఇన్ స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి త్వరగా పనులు ముగించుకుని సాయంత్రంలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు.
Read also: Astrology: డిసెంబర్ 30, సోమవారం దినఫలాలు
నల్లబెల్లి మండలంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి.. రుద్రగూడెం, కొండాయిపల్లి శివారులోని పలుగు ఈనే (కొండవాలు ప్రాంతం) నుంచి అటవీ బాట పట్టింది. పులి పాదముద్రల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నర్సంపేట ఎఫ్ ఆర్ ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరా సాయంతో పలుగు ఈనె ప్రాంతాన్ని చిత్రీకరించి పరిశీలించారు. ఇక్కడే పులి చనిపోయిందని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఇంతలో పెద్దపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తేలడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!