Warangal: రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తీసివేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర పట్ల వ్యతిరేకత ఉంది.. రేవంత్ రెడ్డి సమైక్యవాది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా.. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనే శక్తులు రేవంత్ రెడ్డితో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల పాలైందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిధులు ఉన్నాయి అని చెప్పకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. రాజరిక చరిత్రను మారిపించాలి అంటే జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని తీసివేస్తావా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీ గారు.. రేవంత్ రెడ్డి ఆలోచనలను మీరు అనుమతి ఇస్తారా అని పేర్కొన్నారు. కాకతీయ కళ తోరణాన్ని తొలగించాలనే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోనియా గాంధీ తిరస్కరించాలని అన్నారు. రేవంత్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు.. రేవంత్ రెడ్డి ఆలోచలన పైన మీరు దృష్టి పెట్టాలని కోరారు.
Delhi metro: సీటులో చక్కగా కూర్చుని ఇద్దరు మహిళలు ఏం చేశారంటే..!
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పై రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటు వేశారు.. కేసీఆర్ కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తారు.. రైతులను ఎక్కువ ఆదుకుంటాడు అని ఓటు వేశారన్నారు. అదికూడా 1.8 శాతం ఓట్లతోనే మీరు గెలిచారు.. అది గుర్తుపెట్టుకోండని సూచించారు. కాకతీయ కళా తోరణంలో అప్పటి కాకతీయ రాజుల సుపరి పాలనకు చిహ్నం.. అప్పడి పాడి పంటలకు నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి మార్చుతం అంటే అంత ఈజీ కాదు.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే చిహ్నం మారుతుంది అంత ఈజీ కాదని అన్నారు. రేవంత్ రెడ్డి ఆలోచనలోపై తాను కేసు వేస్తానన్నారు. వేసవి సెలవుల తర్వాత కోర్టుకు పోతామని వినోద్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!