Bhadrakali Bonalu: భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా.. రాజకీయ విభేదాలతోనే పోస్ట్పోన్!
- భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలికంగా వాయిదా..
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన..
- రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తారనే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrakali Bonalu: ప్రతిష్టాత్మకంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అయితే, ఇటీవల భద్రకాళి బోనాలకి సంబంధించి కొంత మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు సోషల్ మీడియాలో ఈ విషయంపై తప్పుడు వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి ముడి పెట్టి కొందరు ఉద్ధేశపూర్వకంగానే ఇబ్బందులు సృష్టిస్తారమోనని భావించి.. ఈ కార్యక్రమంలోకి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Vidadala Rajini: ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు..
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
కాగా, భద్రకాళి అమ్మవారి టెంపుల్ పరిధిలో శాఖాహార బోనాలే ఉంటాయని స్థానిక ఈవో, వేదపండితులు, ప్రభుత్వం పలుమార్లు తెలియజేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపింది. ఆగమ శాస్త్రం ప్రకారమే, వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని అనుకున్నాం.. అయితే, కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయని పేర్కొన్నారు. రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో దుష్ప్రచారం నింపడం మంచిది కాదన్నారు. ఈ నెల 22న భద్రకాళి అమ్మవారి టెంపుల్ లో నిర్వహించాల్సిన బోనాలు రద్దు చేయడం జరిగిందని మంత్రి సురేఖ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే, స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని.. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని, భద్రకాళి అమ్మవారి బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి సురేఖ వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు తెలియజేయదలచినది.. అమ్మవారి పట్ల నిష్కల్మషమైన భక్తి, సంప్రదాయాల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కొంతమంది ప్రచారం చేసిన సమాచారం వల్ల ఏర్పడిన అపోహలకు తావులేదన్నారు. భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందించేందుకు, ప్రభుత్వం వేద పండితుల సలహా మేరకు, ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని కొండా సురేఖ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!