Guinness Record Event of Surya Namaskar: సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థుల గిన్నీస్ రికార్డు.. మంత్రి లోకేష్ అభినందనలు..
- సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించిన గిరిజన విద్యార్ధులు..
- గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు..
- 25 వేల మంది గిరిజన విద్యార్థులు కొత్త రికార్డు..
- విద్యార్థులను అభినందించిన మంత్రి నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guinness Record Event of Surya Namaskar: సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ రికార్డు ప్రకటించనున్నట్టు వెల్లడించారు.. ఇక, జూన్ 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.. వారానికి ఒక రోజు యోగా కచ్చితంగా అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.. అయితే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇచ్చాం అన్నారు మంత్రి లోకేష్.. ఇక్కడకు వచ్చిన పిల్లల కమిట్మెంట్ చాలా సంతోషంగా అనిపించింది.. మా అబ్బాయికి కూడా మీలాంటి శిక్షణ అవసరం అనిపిస్తోందన్నారు.. ఒకే పిలుపుతో ప్రపంచం మొత్తం మనవైపు చూసే విధంగా చేసినందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు లోకేష్..
Read Also: Konda Surekha: ఆయన నల్లికుట్ల మనిషి.. నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
ఇది మనందరం గర్వపడాల్సిన రోజు.. యావత్ భారత్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం విశాఖవైపు చూసిన రోజుగా అభివర్ణించారు లోకేష్… గతంలో ఎప్పుడూ లేని విధంగా గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారు.. 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం గిన్నిస్ రికార్డు.. ఈ రికార్డును శనివారం ప్రకటిస్తారని తెలిపారు… విద్యార్థులందరికీ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు తరఫున అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్.. యోగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.. ఈసారి విశాఖపట్నంలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీని కోరినట్టు వెల్లడించారు.. ఇక, రేపు 5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..