Boianapalli Vinod Kumar: కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశామన్నారు.
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి టెండర్ పిలిస్తే బిహెచ్ఇఎల్ పాల్గొందని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిహెచ్ఇఎల్ ఎవరి ఆధీనంలో ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బండికి ఇచ్చిన స్క్రిప్ట్లో ఏముందో చూసుకొని మాట్లాడాలన్నారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్కు టెండర్లు అప్పగించామని, ప్రపంచవ్యాప్తంగా బిహెచ్ఇఎల్కు మంచి పేరు ఉందన్నారు. బిహెచ్ఇఎల్కు టెండర్ వస్తే ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగారని, బిహెచ్ఇఎల్ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ పని అప్పగించారని వినోద్ కుమార్ తెలియజేశారు. బిహెచ్ఇఎల్ ఇచ్చిన సామాగ్రి తుప్పు పట్టిన సామాగ్రినా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు. కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని చురకలంటించారు. ఎంపిగా ఉండి బండికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కువ ధరలకు కంరెంట్ కొంటున్నారనేది పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. బండికి ఎ, బి, సి, డిలు కూడా తెల్వదని తమకు అర్థమైందని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్ర సిఎండి లేఖ రాశారని, రూ.6.76 నుంచి రూ.12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని బి వినోద్ కుమార్ గుర్తు చేశారు.
Prabhas: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. నెక్ట్స్కి ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!