Boianapalli Vinod Kumar: కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశామన్నారు.
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి టెండర్ పిలిస్తే బిహెచ్ఇఎల్ పాల్గొందని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిహెచ్ఇఎల్ ఎవరి ఆధీనంలో ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బండికి ఇచ్చిన స్క్రిప్ట్లో ఏముందో చూసుకొని మాట్లాడాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్కు టెండర్లు అప్పగించామని, ప్రపంచవ్యాప్తంగా బిహెచ్ఇఎల్కు మంచి పేరు ఉందన్నారు. బిహెచ్ఇఎల్కు టెండర్ వస్తే ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగారని, బిహెచ్ఇఎల్ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ పని అప్పగించారని వినోద్ కుమార్ తెలియజేశారు. బిహెచ్ఇఎల్ ఇచ్చిన సామాగ్రి తుప్పు పట్టిన సామాగ్రినా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు. కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని చురకలంటించారు. ఎంపిగా ఉండి బండికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కువ ధరలకు కంరెంట్ కొంటున్నారనేది పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. బండికి ఎ, బి, సి, డిలు కూడా తెల్వదని తమకు అర్థమైందని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్ర సిఎండి లేఖ రాశారని, రూ.6.76 నుంచి రూ.12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని బి వినోద్ కుమార్ గుర్తు చేశారు.
Prabhas: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. నెక్ట్స్కి ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!