Boianapalli Vinod Kumar: కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశామన్నారు.
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి టెండర్ పిలిస్తే బిహెచ్ఇఎల్ పాల్గొందని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిహెచ్ఇఎల్ ఎవరి ఆధీనంలో ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బండికి ఇచ్చిన స్క్రిప్ట్లో ఏముందో చూసుకొని మాట్లాడాలన్నారు.
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్కు టెండర్లు అప్పగించామని, ప్రపంచవ్యాప్తంగా బిహెచ్ఇఎల్కు మంచి పేరు ఉందన్నారు. బిహెచ్ఇఎల్కు టెండర్ వస్తే ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడిగారని, బిహెచ్ఇఎల్ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్ పని అప్పగించారని వినోద్ కుమార్ తెలియజేశారు. బిహెచ్ఇఎల్ ఇచ్చిన సామాగ్రి తుప్పు పట్టిన సామాగ్రినా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు. కేసీఆర్ దగ్గర మోడీ కమిషన్ తీసుకున్నారా? అని చురకలంటించారు. ఎంపిగా ఉండి బండికి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కువ ధరలకు కంరెంట్ కొంటున్నారనేది పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. బండికి ఎ, బి, సి, డిలు కూడా తెల్వదని తమకు అర్థమైందని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్ర సిఎండి లేఖ రాశారని, రూ.6.76 నుంచి రూ.12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని బి వినోద్ కుమార్ గుర్తు చేశారు.
Prabhas: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. నెక్ట్స్కి ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!