Raja Singh: రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఝలక్ ఇచ్చిన కాషాయపార్టీ.. ఇప్పుడు విక్రమ్ గౌడ్కు తన నియోజకవర్గం టికెట్ ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్గౌడ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
Read also: 900 Temples: 900 ఆలయాలు ఒక్క పర్వతంపైనే …. ప్రపంచ రికార్డు ఇండియాలోనే.
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి రాజా సింగ్ను పోటీ చేయాలని బీజేపీ కోరుతోంది. అయితే అందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా పనిచేశారు. రాజాసింగ్ తన సొంత నియోజకవర్గం గోషామహల్ సెగ్మెంట్ ను వదిలి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసి ఏడాది దాటింది. అయితే ఇప్పటివరకు తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో కాంగ్రెస్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
Read also: Bro: ‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…
ఇక 2014, 2018 ఎన్నికల్లో అదే పార్టీ చేతిలో ఓడిపోయాడు. విక్రమ్ గౌడ్ కూడా 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించగా.. 2016 నుంచి 2020 వరకు గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్పై అసంతృప్తితో రెండేళ్ల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. యువజన కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వహించారు. విక్రమ్ గౌడ్కు నగర వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ఇష్క్, గుండెజారి గల్లంతయిందే చిత్రాలను నిర్మించారు. బలమైన అభ్యర్థి విక్రమ్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. రాజాసింగ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను బీజేపీతోనే ఉంటానని, మరే పార్టీలో చేరబోనని రాజా సింగ్ చెబుతున్నారు. మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Health Tips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేయండి..
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!