Raja Singh: రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఝలక్ ఇచ్చిన కాషాయపార్టీ.. ఇప్పుడు విక్రమ్ గౌడ్కు తన నియోజకవర్గం టికెట్ ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్గౌడ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
Read also: 900 Temples: 900 ఆలయాలు ఒక్క పర్వతంపైనే …. ప్రపంచ రికార్డు ఇండియాలోనే.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి రాజా సింగ్ను పోటీ చేయాలని బీజేపీ కోరుతోంది. అయితే అందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా పనిచేశారు. రాజాసింగ్ తన సొంత నియోజకవర్గం గోషామహల్ సెగ్మెంట్ ను వదిలి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసి ఏడాది దాటింది. అయితే ఇప్పటివరకు తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో కాంగ్రెస్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
Read also: Bro: ‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…
ఇక 2014, 2018 ఎన్నికల్లో అదే పార్టీ చేతిలో ఓడిపోయాడు. విక్రమ్ గౌడ్ కూడా 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించగా.. 2016 నుంచి 2020 వరకు గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్పై అసంతృప్తితో రెండేళ్ల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. యువజన కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వహించారు. విక్రమ్ గౌడ్కు నగర వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ఇష్క్, గుండెజారి గల్లంతయిందే చిత్రాలను నిర్మించారు. బలమైన అభ్యర్థి విక్రమ్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. రాజాసింగ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను బీజేపీతోనే ఉంటానని, మరే పార్టీలో చేరబోనని రాజా సింగ్ చెబుతున్నారు. మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Health Tips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేయండి..
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!