Raja Singh: రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఝలక్ ఇచ్చిన కాషాయపార్టీ.. ఇప్పుడు విక్రమ్ గౌడ్కు తన నియోజకవర్గం టికెట్ ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్గౌడ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
Read also: 900 Temples: 900 ఆలయాలు ఒక్క పర్వతంపైనే …. ప్రపంచ రికార్డు ఇండియాలోనే.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి రాజా సింగ్ను పోటీ చేయాలని బీజేపీ కోరుతోంది. అయితే అందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా పనిచేశారు. రాజాసింగ్ తన సొంత నియోజకవర్గం గోషామహల్ సెగ్మెంట్ ను వదిలి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసి ఏడాది దాటింది. అయితే ఇప్పటివరకు తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో కాంగ్రెస్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
Read also: Bro: ‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…
ఇక 2014, 2018 ఎన్నికల్లో అదే పార్టీ చేతిలో ఓడిపోయాడు. విక్రమ్ గౌడ్ కూడా 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించగా.. 2016 నుంచి 2020 వరకు గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్పై అసంతృప్తితో రెండేళ్ల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. యువజన కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వహించారు. విక్రమ్ గౌడ్కు నగర వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ఇష్క్, గుండెజారి గల్లంతయిందే చిత్రాలను నిర్మించారు. బలమైన అభ్యర్థి విక్రమ్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. రాజాసింగ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను బీజేపీతోనే ఉంటానని, మరే పార్టీలో చేరబోనని రాజా సింగ్ చెబుతున్నారు. మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Health Tips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేయండి..
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!