Vikarabad: రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నం.. రైలు- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. అయితే, అప్పటికే ప్లాట్ఫామ్పై నుంచి రైలు కదులుతుంది. దీంతో రన్నింగ్ ట్రైన్ను ఎక్కేందుకు అతడు ట్రై చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రైలు- ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇక, రైలు కొద్ది దూరం అతడిని లాక్కెల్లింది. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది, పోలీసులు. ట్రైన్ నిలిపివేశారు. తోటి ప్రయాణీకుల సహాయంతో ట్రైన్- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు సతీశ్ ను ప్లాట్ ఫాం పగులగొట్టి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.
Read Also: IND vs ENG: చివరి 3 టెస్టులకు జట్టు ఎంపిక.. విరాట్ కోహ్లీ తిరిగి వస్తాడా?
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
అయితే, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రయాణికుడు సతీశ్ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ట్రైన్ రెండు గంటల పాటు ఆగిపోయింది. అయితే, రైల్వే స్టేషన్ లోపల రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదకరమని తరచూ రైల్వే అధికారులు అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అంతేగాక, అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటారు. రైలు మిస్ అవుతుందన్న హడావుడిలో సదరు ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదం బారిన పడ్డాడు అని వికారాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు పేర్కొన్నారు.
VIDEO | Passengers stop express train as man gets stuck between platform and train at Vikarabad station in Telangana.
A commuter was trying to board a moving train when he fell and was dragged along the platform. Passengers alerted the railway officials. Authorities rescued the… pic.twitter.com/s5KDRYCYTz
— Press Trust of India (@PTI_News) January 30, 2024
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!