IG V. Satyanarayana: అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు.. దాడి చేసిన వారిని వదలం
- అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు- ఐజీ వి. సత్యనారాయణ
- దాడి చేసిన వారిని ఎవరిని వదలము- ఐజీ
- కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగింది- ఐజీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఎంత పెద్ద వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. కలెక్టర్తో పాటు.. అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని అన్నారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ పై ఇతర అధికారులపై దాడి చేశారని ఐజీ పేర్కొన్నారు.
Read Also: Asian Hockey Champions Trophy: తొలి మ్యాచ్లో మలేషియాపై భారీ విజయం సాధించిన భారత జట్టు
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని.. పోలీసు విచారణ చేస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించమని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఐజీ తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Read Also: Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్తో కాల్చిన ప్రియుడు
అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని.. మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డికి బలమైన గాయాలు అయ్యాయని.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై దాడి చేశారన్నారు. లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారుల పైన ఇలాంటి దాడులు జరగడం విచారకరమని ఐజీ అన్నారు.
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!