Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్తో కాల్చిన ప్రియుడు
- హైదరాబాద్లో ప్రియుడి ఘాతుకం
- ప్రియురాలిని దూరం చేశారని అమ్మాయి తండ్రిపై కాల్పులు
- ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితుడు.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంతేకాని చావును కాదు. ప్రేమ ప్రదర్శింపబడుతుంది. అది ఏ రూపంలోనైనా?. అంతేతప్ప.. ఏ విధంగాను మరణాన్ని కోరుకోదు. అయితే ప్రియురాలిని తన నుంచి దూరం చేశారన్న కోపంతో ఓ ప్రియుడు మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రియురాలి తండ్రిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Hyderabad: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం నోడల్ ఆఫీసర్ల నియామకం..
Also Read
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన బల్వీందర్ సింగ్(25)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీందర్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ తిరుగుతున్నాడు. యువతి దుండిగల్లోని ఓ ఇంజనీరింగ్ చదువుతుంటే.. అతడు కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. అబ్బాయి వెంటపడుతున్నట్లు అమ్మాయి తండ్రి గమనించి… కుమార్తెను అమెరికాకు పంపేశాడు. అయితే ప్రియుడు బల్వీందర్.. ఆరు నెలల క్రితం అమ్మాయి తండ్రి ఆనంద్ ఇంటికి వచ్చి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆనంద్.. బల్వీందర్ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షలో కౌన్సెలింగ్ ఇప్పించాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. ఇక ప్రియురాలు అమెరికా వెళ్లిపోవడంతో పగ మరింత రెట్టింపు అయింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..
పథకం ప్రకారం ఆనంద్ను చంపేయాలని బల్వీందర్ ప్లాన్ చేసుకుని ఆదివారం అమ్మాయి ఇంటికి వచ్చాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్గన్, షార్ట్ గన్తో ఆనంద్ ఇంటికి వచ్చి గొడవ పడి కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడి కన్నుపై తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీందర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి బైక్పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీందర్ను అరెస్టు చేసినట్లు సరూర్నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. సెక్షన్ 109 (హత్య ప్రయత్నం), BNS మరియు ఆయుధాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్గన్, షార్ట్గన్ , బైక్, సెల్ఫోన్ స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mandira : ఫ్యాన్స్ కోసం సన్నీ లియోన్ వచ్చేస్తోంది..

తాజావార్తలు
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!