Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్తో కాల్చిన ప్రియుడు
- హైదరాబాద్లో ప్రియుడి ఘాతుకం
- ప్రియురాలిని దూరం చేశారని అమ్మాయి తండ్రిపై కాల్పులు
- ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితుడు.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అంతేకాని చావును కాదు. ప్రేమ ప్రదర్శింపబడుతుంది. అది ఏ రూపంలోనైనా?. అంతేతప్ప.. ఏ విధంగాను మరణాన్ని కోరుకోదు. అయితే ప్రియురాలిని తన నుంచి దూరం చేశారన్న కోపంతో ఓ ప్రియుడు మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రియురాలి తండ్రిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Hyderabad: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం నోడల్ ఆఫీసర్ల నియామకం..
Also Read
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన బల్వీందర్ సింగ్(25)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీందర్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ తిరుగుతున్నాడు. యువతి దుండిగల్లోని ఓ ఇంజనీరింగ్ చదువుతుంటే.. అతడు కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. అబ్బాయి వెంటపడుతున్నట్లు అమ్మాయి తండ్రి గమనించి… కుమార్తెను అమెరికాకు పంపేశాడు. అయితే ప్రియుడు బల్వీందర్.. ఆరు నెలల క్రితం అమ్మాయి తండ్రి ఆనంద్ ఇంటికి వచ్చి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆనంద్.. బల్వీందర్ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షలో కౌన్సెలింగ్ ఇప్పించాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. ఇక ప్రియురాలు అమెరికా వెళ్లిపోవడంతో పగ మరింత రెట్టింపు అయింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..
పథకం ప్రకారం ఆనంద్ను చంపేయాలని బల్వీందర్ ప్లాన్ చేసుకుని ఆదివారం అమ్మాయి ఇంటికి వచ్చాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్గన్, షార్ట్ గన్తో ఆనంద్ ఇంటికి వచ్చి గొడవ పడి కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడి కన్నుపై తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీందర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి బైక్పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీందర్ను అరెస్టు చేసినట్లు సరూర్నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. సెక్షన్ 109 (హత్య ప్రయత్నం), BNS మరియు ఆయుధాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్గన్, షార్ట్గన్ , బైక్, సెల్ఫోన్ స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mandira : ఫ్యాన్స్ కోసం సన్నీ లియోన్ వచ్చేస్తోంది..

తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!