IG V. Satyanarayana: అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు.. దాడి చేసిన వారిని వదలం
- అధికారులపై దాడి రాజకీయ కోణం ఉండవచ్చు- ఐజీ వి. సత్యనారాయణ
- దాడి చేసిన వారిని ఎవరిని వదలము- ఐజీ
- కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగింది- ఐజీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఎంత పెద్ద వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. కలెక్టర్తో పాటు.. అడిషనల్ కలెక్టర్ లింగ నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని అన్నారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ పై ఇతర అధికారులపై దాడి చేశారని ఐజీ పేర్కొన్నారు.
Read Also: Asian Hockey Champions Trophy: తొలి మ్యాచ్లో మలేషియాపై భారీ విజయం సాధించిన భారత జట్టు
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని.. పోలీసు విచారణ చేస్తున్నామని అన్నారు. దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించమని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఐజీ తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Read Also: Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్తో కాల్చిన ప్రియుడు
అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని.. మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డికి బలమైన గాయాలు అయ్యాయని.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై దాడి చేశారన్నారు. లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, అధికారుల పైన ఇలాంటి దాడులు జరగడం విచారకరమని ఐజీ అన్నారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?