Vikarabad Sireesha Case: మొబైల్ ఫోన్ పరిశీలిస్తే, అసలు నిజం తెలుస్తుంది – శిరీష అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Sireesha Sister Srilatha Talks About Sireesha Death: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్లో శిరీష అనే 18 ఏళ్ల యువతి అత్యంత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే! గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో ఆమె గొంతు కోసి చంపి, ఆపై స్క్రూడ్రైవర్తో రెండు కళ్లను ఛిద్రం చేసి.. ఓ నీటి కుంటలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా తమ చెల్లెలు మృతిపై శిరీష అక్కడ శ్రీలత చెప్పుకొచ్చింది. తమ చెల్లెలు దారుణ హత్యకు గురైందని.. తమ ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో ఆమె శవమై తేలిందని భావోద్వేగానికి లోనైంది. తమకు ఎవరిమీదా అనుమానం లేదని తెలిపింది.
Kriti Sanon: అతను నాతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడు.. సీత షాకింగ్ కామెంట్స్
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
అయితే.. తమ చెల్లి (శిరీష) మొబైల్ ఫోన్ పాస్వర్డ్ లాక్ వేసి ఉందని, పోలీసులు దాన్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని శ్రీలత చెప్పింది. బ్లేడుతో గొంతు కోసి శిరీషను హత్య చేశారని, స్క్రూడ్రైవర్తో రెండు కళ్లలో పొడిచి, నీటి గుంటలో పడేశారంటూ రోదించింది. శనివారం రాత్రి శిరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొంది. ఆమె కోసం తాము అన్ని చోట్లా వెతికామని, తెలిసిన వారిని సంప్రదించినా ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. అయితే.. తాము వెతికే క్రమంలో తమ మేనమామ శిరీషను నీటి సంపులో పడి ఉండటాన్ని గమనించారని, అప్పుడు ఆమె శవాన్ని తాము బయటకు తీశామని చెప్పుకొచ్చింది. శిరీషను ఆ పరిస్థితిలో చూసి తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.
Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి
తమ తల్లికి కొంతకాలం నుంచి ఆస్తమా సమస్య ఉందని.. ప్రస్తుతం తమ తల్లి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని శ్రీలత పేర్కొంది. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. ఇంట్లో తను, శిరీష, అన్న, తమ్ముడు ఉంటున్నామని తెలిపింది. అయితే.. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటిపర్యంతం అయ్యింది. తమ అక్కను చంపిన వాళ్లను వెంటనే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా.. శిరీష మరణం స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు.. ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు, నేరస్తులెవరో కనుగొని, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!