Vikarabad Sireesha Case: మొబైల్ ఫోన్ పరిశీలిస్తే, అసలు నిజం తెలుస్తుంది – శిరీష అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Sireesha Sister Srilatha Talks About Sireesha Death: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్లో శిరీష అనే 18 ఏళ్ల యువతి అత్యంత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే! గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో ఆమె గొంతు కోసి చంపి, ఆపై స్క్రూడ్రైవర్తో రెండు కళ్లను ఛిద్రం చేసి.. ఓ నీటి కుంటలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా తమ చెల్లెలు మృతిపై శిరీష అక్కడ శ్రీలత చెప్పుకొచ్చింది. తమ చెల్లెలు దారుణ హత్యకు గురైందని.. తమ ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో ఆమె శవమై తేలిందని భావోద్వేగానికి లోనైంది. తమకు ఎవరిమీదా అనుమానం లేదని తెలిపింది.
Kriti Sanon: అతను నాతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడు.. సీత షాకింగ్ కామెంట్స్
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
అయితే.. తమ చెల్లి (శిరీష) మొబైల్ ఫోన్ పాస్వర్డ్ లాక్ వేసి ఉందని, పోలీసులు దాన్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని శ్రీలత చెప్పింది. బ్లేడుతో గొంతు కోసి శిరీషను హత్య చేశారని, స్క్రూడ్రైవర్తో రెండు కళ్లలో పొడిచి, నీటి గుంటలో పడేశారంటూ రోదించింది. శనివారం రాత్రి శిరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొంది. ఆమె కోసం తాము అన్ని చోట్లా వెతికామని, తెలిసిన వారిని సంప్రదించినా ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. అయితే.. తాము వెతికే క్రమంలో తమ మేనమామ శిరీషను నీటి సంపులో పడి ఉండటాన్ని గమనించారని, అప్పుడు ఆమె శవాన్ని తాము బయటకు తీశామని చెప్పుకొచ్చింది. శిరీషను ఆ పరిస్థితిలో చూసి తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.
Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి
తమ తల్లికి కొంతకాలం నుంచి ఆస్తమా సమస్య ఉందని.. ప్రస్తుతం తమ తల్లి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని శ్రీలత పేర్కొంది. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. ఇంట్లో తను, శిరీష, అన్న, తమ్ముడు ఉంటున్నామని తెలిపింది. అయితే.. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటిపర్యంతం అయ్యింది. తమ అక్కను చంపిన వాళ్లను వెంటనే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా.. శిరీష మరణం స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు.. ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు, నేరస్తులెవరో కనుగొని, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!