Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు.. నేడు వీసీ ని విచారించే చాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు. నేడు వీసీ ని విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ కూడా ఏసీబీ, విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. యూనివర్సిటీలో రెండేళ్లలో చేసిన ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం విచారణ చేయాలని ఈసీ పిర్యాదు చేయడంతో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఇంచార్జీ రిజిస్ట్రార్ కనకయ్యను విజిలెన్స్ అధికారులు విచారించారు. ఇవాల తనిఖీలపై ఉత్కంఠ నెలకొంది.
Read also: Saptapadhi: ఎడారిలో సప్తపది..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాద్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో దాదాపు 15 మందికి పైగా విజిలెన్స్ అధికారులు మూడు వాహనాల్లో పరిపాలన భవనం వద్దకు వచ్చి పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమైన కంప్యూటర్ సీపీయూ, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అకౌంట్ సెక్షన్ లో పెట్టి అందులోని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పాలక మండలి, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్న విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం పరిపాలనా భవనానికి చేరుకుంది. వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా అప్పటికే కారులో పరిపాలన భవనం నుంచి ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని వెళ్లిపోయారు. అధికారుల బృందం తొలుత వీసీ ఛాంబర్కు వెళ్లి చూడగా వీసీ అక్కడ లేకపోవడంతో వీసీ పీఏ సవిత కూడా ఛాంబర్కు తాళం వేసి వెళ్లిపోయారు. పరిపాలన భవనంలోని ఎస్బీఐ బ్యాంకు అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను సేకరించారు. అవన్నీ ప్రింటవుట్ ద్వారా బ్యాంకు నుంచి తీసుకున్నవే. అకౌంట్ సెక్షన్ లో ఐదు కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను సీజ్ చేసి సీల్ చేశారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!