Saptapadhi: ఎడారిలో సప్తపది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saptapadhi: సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు.. ఒక యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరు యువతిని ఎడారిలో గడ్డితో వేసిన మంట చుట్టూ తిప్పుతూ తమ పెళ్లి అయిపోయిందని.. మరెవరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read also
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
సిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జూన్ 1న చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైసల్మేర్ జిల్లా మోహన్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే జూన్ 1న అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ అనే యువకుడు.. మరి కొంత మందితో కలిసి యువతిని కిడ్నాప్ చేశాడు. నిందితుడు పుష్పేంద్ర బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన యువతిని ఎడారిలోకి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను తన చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి పెళ్లి జరిగిపోయిందని.. బాధితురాలికి వార్నింగ్ ఇచ్చాడు. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
Read also
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు జైసల్మేర్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు జూన్ 12న పెళ్లి జరగాల్సి ఉందని తెలిపారు. చాలా రోజుల నుంచి నిందితుడు తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. పెళ్లిని చెడగొడతానని బెదిరించాడని చెప్పారు. నిందితుల్లో ఒకడ్నే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగతా వాళ్లను వదిలేశారని యువతి బంధువులు మండిపడుతున్నారు. నిందితుడి ఆస్తులను జప్తు చేశామని.. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు బాధితులకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!