Saptapadhi: ఎడారిలో సప్తపది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saptapadhi: సాధారణంగా ఎడారిలో నడవాలంటేనే భయమేస్తుంది. అంత ఎండలో నడవటం అంటే చాలా కష్టం. అటువంటి ఎడారిలో సప్తపది ఎంటనీ అనుకుంటున్నారా? ఇది ఏదో సరదాపడి చేసుకున్న సప్తపది కాదు.. ఒక యువతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరు యువతిని ఎడారిలో గడ్డితో వేసిన మంట చుట్టూ తిప్పుతూ తమ పెళ్లి అయిపోయిందని.. మరెవరిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read also
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
సిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జూన్ 1న చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైసల్మేర్ జిల్లా మోహన్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 12న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే జూన్ 1న అదే ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర సింగ్ అనే యువకుడు.. మరి కొంత మందితో కలిసి యువతిని కిడ్నాప్ చేశాడు. నిందితుడు పుష్పేంద్ర బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన యువతిని ఎడారిలోకి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను తన చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి పెళ్లి జరిగిపోయిందని.. బాధితురాలికి వార్నింగ్ ఇచ్చాడు. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
Read also
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు జైసల్మేర్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు జూన్ 12న పెళ్లి జరగాల్సి ఉందని తెలిపారు. చాలా రోజుల నుంచి నిందితుడు తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. పెళ్లిని చెడగొడతానని బెదిరించాడని చెప్పారు. నిందితుల్లో ఒకడ్నే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగతా వాళ్లను వదిలేశారని యువతి బంధువులు మండిపడుతున్నారు. నిందితుడి ఆస్తులను జప్తు చేశామని.. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు బాధితులకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!