Prashanth Reddy: డబ్బులతో కొను.. లేకుంటే జైల్లో వెయ్.. ఇదే బీజేపీ సిద్ధాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Fires On BJP PM Modi: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దేవుని పేరుతో బీజేపీ దేశాన్ని నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. మోడీ, అదాని కలిస్తేనే ప్రధాని అని వర్ణించారు. మోడీ సచ్చీలుడే అయితే.. అదానిపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు కేసులకు మోడీ, అమిత్ షా కలిసి.. ఏకంగా 22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. దేశ రక్షణను మోడీ గాలికి వదిలేశారన్నారు. బీబీసీపై ఐటీ దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బులతో కొను, లేకుంటే జైల్లో వెయ్ అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకు నడుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవితను జైల్లో వేస్తామని బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తాడని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్న బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని.. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనపై పోరాటం చేస్తోంది ఒక్క సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు.
Antony Blinken: ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధ దాడి చేయకుండా భారత్, చైనాలే అడ్డుకున్నాయి.
Also Read
అంతకుముందు.. కల్లబొల్లి మాటలు చెప్పి, గ్రామాల్లో ఒక్క పైసా అభివృద్ధి పనులు చేయని వారిని నమ్మొద్దని నమ్మొద్దని ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేవుడి పేరుతో, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి.. ఓట్లు దండుకొని, రైతులను పసుపు బోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వారికి మరోసారి నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని మాటిచ్చారు. ఏ మత గ్రంథమైనా అందరూ బాగుండాలని చెబుతుందని, అందులో మనం ఉండాలని కోరుకోవాలని అన్నారు. కానీ ఈమధ్య దేశంలో స్వార్థ, వింత పోకడలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్నిమతాలు సమానంగా గౌరవించబడుతున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Singer Amarjeet: బంపరాఫర్ పట్టేసిన ఇసుకబట్టి కార్మికుడు.. ఏకంగా సినిమా ఛాన్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!