Prashanth Reddy: డబ్బులతో కొను.. లేకుంటే జైల్లో వెయ్.. ఇదే బీజేపీ సిద్ధాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Fires On BJP PM Modi: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దేవుని పేరుతో బీజేపీ దేశాన్ని నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. మోడీ, అదాని కలిస్తేనే ప్రధాని అని వర్ణించారు. మోడీ సచ్చీలుడే అయితే.. అదానిపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు కేసులకు మోడీ, అమిత్ షా కలిసి.. ఏకంగా 22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. దేశ రక్షణను మోడీ గాలికి వదిలేశారన్నారు. బీబీసీపై ఐటీ దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బులతో కొను, లేకుంటే జైల్లో వెయ్ అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకు నడుస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవితను జైల్లో వేస్తామని బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తాడని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్న బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని.. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనపై పోరాటం చేస్తోంది ఒక్క సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు.
Antony Blinken: ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధ దాడి చేయకుండా భారత్, చైనాలే అడ్డుకున్నాయి.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
అంతకుముందు.. కల్లబొల్లి మాటలు చెప్పి, గ్రామాల్లో ఒక్క పైసా అభివృద్ధి పనులు చేయని వారిని నమ్మొద్దని నమ్మొద్దని ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేవుడి పేరుతో, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి.. ఓట్లు దండుకొని, రైతులను పసుపు బోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వారికి మరోసారి నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని మాటిచ్చారు. ఏ మత గ్రంథమైనా అందరూ బాగుండాలని చెబుతుందని, అందులో మనం ఉండాలని కోరుకోవాలని అన్నారు. కానీ ఈమధ్య దేశంలో స్వార్థ, వింత పోకడలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్నిమతాలు సమానంగా గౌరవించబడుతున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Singer Amarjeet: బంపరాఫర్ పట్టేసిన ఇసుకబట్టి కార్మికుడు.. ఏకంగా సినిమా ఛాన్స్
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..