Vemula Prashanth Reddy : పీయూష్ గోయల్ సర్పంచ్గా కూడా పనికిరాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని, కేంద్రం తమ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సమస్య పరిష్కారానికి చివరి వరకు కొట్లాడాలని, తెలంగాణ మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి అవమానకరంగా మాట్లాడారన్నారు.
బండి సంజయ్ అన్న మాటలు, బీజేపీ ఎంపీలు వరి వేయమని చెప్పిన మాటలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, నూకల బియ్యాన్ని అలవాటు మీ ప్రజలకు అలవాటు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ గా కుడా పనికిరాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు విమర్శలు చేయడం లేదో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతాం… తెలంగాణ రైతులు పండించిన పంటలకు కొనుగోలు చేయిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు, ఈసారి కేంద్ర ప్రభుత్వంను వదిలిపెడితే ప్రతి యాసంగికి ఇదే పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!