V. C. Sajjanar: పాటించకపోతే మీకే నష్టం..! ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులకు సజ్జనార్ సలహా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. C. Sajjanar: ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్ గా ఉండాలని వీసీ సజ్జనార్ సలహా ఇచ్చారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా సాయంతో బ్యాంక్ ఏజెంట్లను నియమించుకుని.. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
Read also: Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట..!
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
కావున ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్ లాగిన్ లు తెరవాలి. కార్పొరేట్ లాగిన్ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది.. జాగ్రత్త! అని సూచించారు. విదేశాల నుండి ఇండియా బ్యాంక్ ఖాతాలకు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్లను బ్లాక్ చేయాలని తెలిపారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న కాల్ సెంటర్ల నుంచి జరుగుతున్నాయని అన్నారు.
Read also: Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం ఆ కుటుంబం మాత్రమే లాభ పడింది..!
టెలిగ్రామ్ ద్వారా భారతీయులను రిక్రూట్ చేసుకుని.. వారి సాయంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల నుంచి డ్రగ్ పార్శిల్ ఫ్రాడ్స్ జరుగున్నాయన్నారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే సంభవిస్తుండం గమనార్హం. ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే స్వీయ అవగాహన కలిగిఉండటం ఒక్కటే మార్గం అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే అసలే స్పందించవద్దు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దన్నారు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దని తెలిపారు. ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సలహా ఇచ్చారు.
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్!! డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank… pic.twitter.com/w3MVFUsyXE
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 27, 2024
Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!