V. C. Sajjanar: పాటించకపోతే మీకే నష్టం..! ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులకు సజ్జనార్ సలహా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. C. Sajjanar: ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్ గా ఉండాలని వీసీ సజ్జనార్ సలహా ఇచ్చారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా సాయంతో బ్యాంక్ ఏజెంట్లను నియమించుకుని.. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
Read also: Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట..!
Also Read
- H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
కావున ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్ లాగిన్ లు తెరవాలి. కార్పొరేట్ లాగిన్ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది.. జాగ్రత్త! అని సూచించారు. విదేశాల నుండి ఇండియా బ్యాంక్ ఖాతాలకు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్లను బ్లాక్ చేయాలని తెలిపారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న కాల్ సెంటర్ల నుంచి జరుగుతున్నాయని అన్నారు.
Read also: Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం ఆ కుటుంబం మాత్రమే లాభ పడింది..!
టెలిగ్రామ్ ద్వారా భారతీయులను రిక్రూట్ చేసుకుని.. వారి సాయంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల నుంచి డ్రగ్ పార్శిల్ ఫ్రాడ్స్ జరుగున్నాయన్నారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే సంభవిస్తుండం గమనార్హం. ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే స్వీయ అవగాహన కలిగిఉండటం ఒక్కటే మార్గం అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే అసలే స్పందించవద్దు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దన్నారు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దని తెలిపారు. ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సలహా ఇచ్చారు.
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్!! డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank… pic.twitter.com/w3MVFUsyXE
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 27, 2024
Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!