Chandrababu: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు. 9 సార్లు సీఎం జగన్ కరెంటు చార్జీలు పెంచారు.. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది.. ఇసుక అక్రమ రవాణా వెనుక తోపు ఉన్నాడు.. కియా పరిశ్రమ ఏపీకి రావటం మన రేంజ్.. జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వాళ్ల రేంజ్ అన్నారు.. రాయలసీమలో 52 సీట్లకు 49 సీట్లు వైసీపీకి ఇచ్చారు.. ఏం ఒరగపెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..
Also Read
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలి అని చంద్రబాబు కోరారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి.. సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తానని.. గోదావరిలో ముంచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి బ్రదర్స్ ఆరాచాలకు అడ్డు లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన దోపిడీలు, కమిషన్ లే.. తోపుదుర్తి బ్రదర్స్ దెబ్బకు జాకీ పరిశ్రమ ఎగిరి తెలంగాణలో పడింది అని ఆయన ఆరోపించారు. తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు ఆటోనగర్ భూములు కూడా మింగేయాలి అనుకున్నారు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన అరాచకాలను వదిలిపెట్టను..వడ్డీతో సహా చెల్లిస్తాం.. తోపుదుర్తి అక్రమాలు, అరాచకాలపై విచారణ జరిపిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. 140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. నేను అందరి వాడిని.. ఏ ఒక్కరి కోసం పని చేయడం లేదు అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!