Kishan Reddy: బైక్ ర్యాలీ ప్రారంభించి బుల్లెట్ నడిపిన కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈ ఏడాది విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగ్య లక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం బైక ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విమోచన దినోత్సవంలో సందర్భంగా.. కిషన్ రెడ్డి బుల్లెట్ నడిపి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళల బైక్ ర్యాలీ మొదలైన ఈబైక్ ర్యాలీ.. చార్మినార్ నుండి పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బీజేపీ శ్రేణులు.
17న హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఒకరోజు ముందే హైదరాబాద్ రానున్నారు. రేపు సాయంత్రం నగరానికి చేరుకుని శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో పాల్గొని, పారా మిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే.. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించే అవకాశం వుందని పార్టీ వర్గాల్లో టాక్. కానీ.. అధికారికంగా ఖరారు కాలేదని.. ఒక వేళ కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెల్లే క్రమమంలో.. ప్రభాస్ తో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే.. శనివారం పరేడ్ గ్రౌండ్లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదే రోజు ప్రధాని మోడీ బర్త్ డే కావడంతో పార్టీ ఏర్పాటు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. విమోచన ఉత్సవాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను టీఆర్ఎస్ నేతలు చింపేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Also Read
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
Live: Flaging-off the Women's Tiranga Bike Rally as a part of #HyderabadLiberationDay Celebrations at Bhagyalaxmi Temple, Charminar. https://t.co/b1DA4373rI
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2022
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!