Kishan Reddy: స్వప్న లోక్ ఘటన.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్ ను ఇవాల కిషన్ రెడ్డి వెళ్లారు. అక్కడున్న పరిస్థితులను ఆరా తీసారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను సీఎం కేసీఆర్కి లెటర్ కూడా రాశానని గుర్తు చేశారు. ఇప్పటికైనా గోదాంలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read also: Shocking Decision: పెళ్లైన గంటల వ్యవధిలోనే వధువు షాకింగ్ నిర్ణయం.. ఏం చేసిందంటే?
Also Read
జనావాసాల మధ్య గోదాంలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. Ghmc రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి కానీ.. ఆదాయం వేట లోనే ఉంటుందని ఆరోపించారు. ఆదాయం కోసం ఇల్లీగల్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Q net లాంటి సంస్థల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. తూతూమంత్రంగా కమిటీలు వేసి నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి మానుకోవాలని అన్నారు. స్వప్న లోక్ ఘటనలో చనిపోయిన వారికి కేంద్రం తరఫున కూడా నష్ట పరిహారం చెల్లించాలని, ప్రధాన మంత్రిని కోరానని, ఒక్కొక్కరికి 2 లక్షలు చెల్లించేలా ఒప్పుకున్నారన్నాని తెలిపారు.
అనంతరం హెల్తి బేబీ షో కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పెద్ద పిల్లలు, పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఇలాంటి హెల్తి బేబీ షో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ, వెళ్ళనేస్ సెంటర్స్, అయుష్మన్ భారత్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లల తల్లిపాలు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం ఉన్నట్లే అని తెలిపారు. రానున్న రోజుల్లో మోడీ నాయకత్వంలో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు.
MLC Jeevan reddy: జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రోళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారు
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!