Kishan Reddy: స్వప్న లోక్ ఘటన.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్ ను ఇవాల కిషన్ రెడ్డి వెళ్లారు. అక్కడున్న పరిస్థితులను ఆరా తీసారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను సీఎం కేసీఆర్కి లెటర్ కూడా రాశానని గుర్తు చేశారు. ఇప్పటికైనా గోదాంలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Read also: Shocking Decision: పెళ్లైన గంటల వ్యవధిలోనే వధువు షాకింగ్ నిర్ణయం.. ఏం చేసిందంటే?
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
జనావాసాల మధ్య గోదాంలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. Ghmc రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి కానీ.. ఆదాయం వేట లోనే ఉంటుందని ఆరోపించారు. ఆదాయం కోసం ఇల్లీగల్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Q net లాంటి సంస్థల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. తూతూమంత్రంగా కమిటీలు వేసి నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి మానుకోవాలని అన్నారు. స్వప్న లోక్ ఘటనలో చనిపోయిన వారికి కేంద్రం తరఫున కూడా నష్ట పరిహారం చెల్లించాలని, ప్రధాన మంత్రిని కోరానని, ఒక్కొక్కరికి 2 లక్షలు చెల్లించేలా ఒప్పుకున్నారన్నాని తెలిపారు.
అనంతరం హెల్తి బేబీ షో కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పెద్ద పిల్లలు, పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఇలాంటి హెల్తి బేబీ షో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ, వెళ్ళనేస్ సెంటర్స్, అయుష్మన్ భారత్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లల తల్లిపాలు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం ఉన్నట్లే అని తెలిపారు. రానున్న రోజుల్లో మోడీ నాయకత్వంలో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు.
MLC Jeevan reddy: జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రోళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..