మియాపూర్లో యూఎంఈడీ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్య సంరక్షణ విభాగంలో పేరుగాంచిన యూఎంఈడీ(UMED) గ్రూప్ తన డయాగ్నోస్టిక్స్ సేవలను, అత్యాధునిక విశ్లేషణ కేంద్రాన్ని మియాపూర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని అత్యుత్తమ ప్రయోగశాలలతో సమానమైన ఈ కొత్త సదుపాయాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత శ్రీ చేతన్ ఆనంద్ గారూ పాల్గొన్నారు. చేతన్ ఆనంద్ యూఎంఈడీ (UMED) డయాగ్నోస్టిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శ్రీ ఎ. రమేష్ రెడ్డి గారు, IPS; శ్రీ R.V. రెడ్డి గారు, IRS; శ్రీ జడేశ్వర్ గౌడ్ గారు, మాదాపూర్ కార్పొరేటర్; మరియు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, మియాపూర్ కార్పొరేటర్ లు హాజరయ్యారు.
Also Read
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా యూఎంఈడీ డయాగ్నోస్టిక్స్ సిఇఒ డాక్టర్ సాజిద్ మాట్లాడుతూ, “యూఎంఈడీ డయాగ్నోస్టిక్స్ ద్వారా నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలను అందించడం మాకు గర్వంగా ఉంది. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా, మేము మీకు వార్షిక వైద్య పరీక్షలను అందిస్తున్నాము, దీని వలన మీరు వార్షిక నిర్వహణ బాధ్యతలను(యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) తామే చూసుకుంటామని, ఎవరికి అవసరమైన సమయంలోనైనా ఏడాదిలోగా డయాగ్నస్టిక్ సేవలను అందిస్తామన్నారు.
ల్యాబ్ పరీక్ష కోసం నమూనాలను సేకరించడానికి మా నిపుణులు వ్యక్తిగతంగా మీ ఇంటి వద్దకు వస్తారన్నారు. మా బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ శ్రీ చేతన్ ఆనంద్తో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. శ్రీ చేతన్ ఆనంద్ “UMED గ్రూప్తో కలిసి పనిచేయడం నాకు సంతోషంగా ఉంది. క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఈనాటి అవసరమన్నారు. అత్యుత్తమ సేవలతోపాటు నాణ్యమైన, నిబద్ధతతో కూడిన సేవలను యూఎంఈడీ ద్వారా పొందవచ్చన్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం గొప్ప అనుభూతి.
యూఎంఈడీ (UMED) డయాగ్నోస్టిక్స్ రోగుల అన్ని అవసరాలను తీర్చడానికి అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన నిపుణులు మరియు కన్సల్టింగ్ వైద్యులను కలిగి ఉంది. ల్యాబ్ టెస్ట్ కోసం శాంపిల్ సేకరణ కోసం వారికి మందుల హోం డెలివరీ మరియు డోర్ స్టెప్ సేవలను అందిస్తుంది. రోగులకు అన్ని సమయాలలో ఉత్తమమైన వాటిని అందించడానికి అంకితభావం తో పనిచేస్తుంది.
UMED గ్రూప్ గురించి…
2011 లో మిస్టర్ యువి రెడ్డి మరియు శ్రీమతి వసుంధర స్థాపించిన UMED గ్రూప్, UMED ఫార్మా ల్యాబ్లను కలిగి ఉంది, ఇది ఫార్మా మరియు బయోఫార్మాస్యూటికల్ టెస్టింగ్లో ఉంది. నేడు ఇది 500+ ఉద్యోగులతో USA, శ్రీలంక, ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్లో బలమైన ఉనికిని కలిగి ఉంది. జాగోర్ లైఫ్ సైన్స్, డయాగ్నోస్టిక్స్ కిట్లు మరియు స్థూల పోషకాల తయారీదారు, మరియు ఎలెనా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల తయారీదారు కూడా మా గ్రూప్ కంపెనీలే. ఈ బృందం 2022 లో ఉగాండాలో ఓరల్ సాలిడ్ డోసేజ్ ప్లాంట్ను కూడా ప్రారంభించాలని భావిస్తోంది. ఈ గొప్ప అనుభవం అంతర్జాతీయ ప్రమాణాలతో మరియు అత్యంత అర్హత కలిగిన సిబ్బందితో UMED డయాగ్నోస్టిక్స్ ప్రారంభించడానికి వీలు కల్పించింది. UMED డయాగ్నోస్టిక్స్కు డాక్టర్ సాజిద్ మరియు ఉడుముల రేణుక నాయకత్వం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!