Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: 11వ తరగతిలోనే చదువు స్వస్తి చెప్పిన ఒక 18 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా రూ. 64 కోట్లకు పైగా డిజిటల్ దోపిడీకి స్కెచ్ వేసి దేశవ్యాప్తంగా సైబర్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలిగ్రామ్ వేదికలుగా నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన మొబైల్ యాప్లను (Malicious APKs) తయారు చేస్తూ సైబర్ నేరగాళ్ల ముఠాలకు విక్రయిస్తున్న రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే మాస్టర్మైండ్ను గుజరాత్లోని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. చదువు మధ్యలోనే ఆపేసినా, రోహిత్ తన 16 ఏళ్ల వయసులోనే కోడింగ్లో నిపుణుడిగా మారి, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, అమరికన్ ఎక్స్ప్రెస్, పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పోర్టళ్లు, బిగ్బాస్కెట్, ఆధార్ వంటి సేవలను పోలిన నకిలీ యాప్లను తయారు చేయడం మొదలుపెట్టాడు.
ఈ సైబర్ దందా వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం ఉంది. జార్ఖండ్లోని జామ్తారా, హర్యానా, రాజస్థాన్లకు చెందిన సైబర్ ముఠాలకు ఈ నకిలీ యాప్లను నెలకు రూ. 15,000 సబ్స్క్రిప్షన్ పద్ధతిలో క్రమం తప్పకుండా అప్డేట్లు ఇస్తూ సరఫరా చేసేవాడు. ఇందులో బాధితులు నమ్మి ఇన్స్టాల్ చేసుకునే “విక్టిమ్ యాప్”, వారి ఫోన్లలోని ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను నేరుగా చూసి నియంత్రించే “అడ్మిన్ యాప్” అనే రెండు వర్షన్లను రూపొందించాడు. ఈ ఏడాది మే నెలలో సూరత్కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్లో ‘PNB One.apk’ అనే నకిలీ లింక్ రాగా, దాన్ని నిజమైనదిగా నమ్మి ఇన్స్టాల్ చేసుకుని రూ. 5 లక్షలు పోగొట్టుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Also Read
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
బాధితుడు సైబర్ హెల్ప్లైన్ (1930)కి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. రోహిత్ మొత్తం 121 హానికరమైన యాప్లను తయారు చేయగా, అవి దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఇన్స్టాల్ అయ్యాయని, వాటిలో 2,928 ఫోన్లు పూర్తిగా నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లాయని తేలింది. వీటి ద్వారా ఏకంగా 54,094 అక్రమ లావాదేవీలు జరిపి రూ. 64.38 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఇందులో ఆర్టీఓ చలాన్ నకిలీ యాప్ల ద్వారానే అత్యధిక నేరాలు జరిగాయి. నిందితుడి నుంచి ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న మిగిలిన సైబర్ ముఠాల గుట్టు విప్పేందుకు విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!