సెల్ఫీలు దిగుతూ గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెల్ఫీల మోజు కారణంగా యువత తమ ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా తెలంగాణలో సెల్ఫీ మోజులో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు.
Read Also: అంతర్వేదిలో చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలుసా?
Also Read
వెంటనే గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా మరో ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరి కోసం మత్స్యకారులతో కలిసి గాలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు యువకులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!