Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్లో గత రెండు నెలలుగా పులులు పలు ఆవులపై దాడి చేసి చంపిన ఘటనలు సంగతి తెలిసిందే.. అయితే ఆదివారం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దరిగాం అటవీ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా ఆ ప్రాంతం సమీపంలో మూడు సంవత్సరాల వయసు గల మరో పులి కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు. నేడు అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ సందర్శించారు.
Read also: Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్ స్కేల్పై 6.7 తీవ్రత!
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర గాయాలపాలై ఓ పులి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి మృతిపై అటవీశాఖ అధికారులు ఆదివారం కాగజ్ నగర్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీసీఎఫ్ శాంత రాం మాట్లాడుతూ.. ఆశ్రయం కోసం రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో పెద్దపులి చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన దాదాపు ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని తెలిపారు. పులి చనిపోయిందని తెలియడంతో అధికారులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. నివాసం కోసం రెండేళ్ల పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి చనిపోయిందని తెలిపారు. పులి మెడ, తలపై బలమైన గాయాలు ఉండడంతో రెండు పులుల మధ్య ఘర్షణ వల్లే చనిపోయి ఉంటుందని చేశారు. పోస్ట్మార్టం అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.
Brazil: బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!