Twist in Firing Case: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో మరో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ ఫిర్యాదులను పట్టించుకోలేదు స్థానిక పోలీసులు. గత వారం రోజుల క్రితం ప్లాట్ ఓనర్స్ ను బెదిరించాడు శ్రీనివాస్ రెడ్డి . తమకు న్యాయం జరగకపోవడంతో కోర్ట్ మెట్లెక్కేందుకు సిద్ధం అయ్యారు లేక్ విల్లా ఓనర్స్. ఇంతలో అగంతకుల కాల్పుల్లో మరణించారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
1996 లో నెల్లూర్ వాసులకు భూమి అమ్మారు ఇంద్రా రెడ్డి, నర్సింహారెడ్డి, దేవి, పురుషోత్తం రెడ్డి. నెల్లూర్ వాసుల నుండి భూమిని సెల్ డీడ్ చేసుకున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ సభ్యులు. ధరణి లో అదే భూమికి ఓనర్లు గా ఇంద్రారెడ్డి, నర్సింహా రెడ్డి పేర్లు వున్నాయి. వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమి గా చూపించి ఇంద్రా రెడ్డి వద్ద నుండి ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.
అప్పటి నుండి లేక్ విల్లా ప్లాట్స్ లోకి వెళ్లి జేసీబీలతో అక్రమంగా చొరబడి బెదిరింపులకు పాల్పడ్డారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి. గత నెలలో తమను బెదిరించారంటున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. లేక్ విల్లా తో పాటు ఇంకొన్ని భూములను ఇదే తరహాలో కబ్జా చేశారని చెబుతున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు చేసినా లాభం లేదంటున్నారు లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్. కాల్పులకు సంబంధించి పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!