Tummala Nageswara Rao : రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమము అయినటువంటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ద్వారా అమలు చేయబడుతుందన్నారు.
తెలంగాణలో రాష్ట్రంలో 1992-93 నుండి 2023-24 వరకు సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైనది. తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగింది. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి వరకు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా (42) నర్సరీలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి అవశ్యకత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రస్తుతం ముడి పామ్ ఆయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్ర ప్రభుత్వo పూర్తిగా ఎత్తివేసింది. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను సంరక్షించడానికి ముడి పామాయిల్ దిగుమతులపై వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సుంకం విదిoచి ఆయిల్ పామ్ గెలల ధరల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరలను కనీసం టన్నుకి రూపాయలు 18 వేలు ఉండేటట్లుగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరడమైనది. కేంద్ర ప్రభుత్వం 2021 లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ప్రారంబించి, అందులో భాగంగా రైతులకు లాభదాయకమైన ధరను అందించాలనే ఉద్దేశ్యం తో Viability Gap Funding అనే సూత్రాన్ని ప్రతిపాదించింది. ఈ సూత్రం 19% OER (నూనె ఉత్పత్తి శాతం) ప్రామాణికం గా తీసుకొని పామ్ ఆయిల్ గెలల ధరలు నిర్ణయించబడుతుంది.
పైగా ఉప ఉత్పత్తులయిన ఆయిల్ పామ్ గింజలు నుండి వచ్చే నూనె ధరను పరిగణలోకి తీసుకున్నచో నూనె ఉత్పత్తి శాతం సుమారు 22% గా లభించును. 19% గా నూనె ఉత్పత్తి శాతంను నిర్ణయిచడం వలన రైతులకు నష్టం జరగుతుంది. ఈ కారణంచేత తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించుటకు పాత పద్దతినే అవలంబిస్తుంది.
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ముడి పామ్ ఆయిల్ ధరలు స్థిరీకరించడానికి దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించడం కొరకు ముడి పామ్ ఆయిల్ దిగుమతి సుంకంపై విధివిధానాలను రూపొందించాలని, ఆయిల్ పామ్ రైతులను మరియు కంపెనీల ను కలుపుకుని Viability Gap Funding సూత్రాన్ని తిరిగి సమీక్షించి రైతులకు పామ్ ఆయిల్ గెలల ధర లాభసాటిగా ఉండేలా నిర్ణయించి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాత్యులు గారిని మంత్రి వర్యులు లేఖ ద్వారా కోరడమైనది.
తాజావార్తలు
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!