Tummala Nageswara Rao : రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమము అయినటువంటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ద్వారా అమలు చేయబడుతుందన్నారు.
తెలంగాణలో రాష్ట్రంలో 1992-93 నుండి 2023-24 వరకు సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైనది. తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగింది. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి వరకు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా (42) నర్సరీలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి అవశ్యకత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
- OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
ప్రస్తుతం ముడి పామ్ ఆయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్ర ప్రభుత్వo పూర్తిగా ఎత్తివేసింది. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను సంరక్షించడానికి ముడి పామాయిల్ దిగుమతులపై వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సుంకం విదిoచి ఆయిల్ పామ్ గెలల ధరల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరలను కనీసం టన్నుకి రూపాయలు 18 వేలు ఉండేటట్లుగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరడమైనది. కేంద్ర ప్రభుత్వం 2021 లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ప్రారంబించి, అందులో భాగంగా రైతులకు లాభదాయకమైన ధరను అందించాలనే ఉద్దేశ్యం తో Viability Gap Funding అనే సూత్రాన్ని ప్రతిపాదించింది. ఈ సూత్రం 19% OER (నూనె ఉత్పత్తి శాతం) ప్రామాణికం గా తీసుకొని పామ్ ఆయిల్ గెలల ధరలు నిర్ణయించబడుతుంది.
పైగా ఉప ఉత్పత్తులయిన ఆయిల్ పామ్ గింజలు నుండి వచ్చే నూనె ధరను పరిగణలోకి తీసుకున్నచో నూనె ఉత్పత్తి శాతం సుమారు 22% గా లభించును. 19% గా నూనె ఉత్పత్తి శాతంను నిర్ణయిచడం వలన రైతులకు నష్టం జరగుతుంది. ఈ కారణంచేత తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించుటకు పాత పద్దతినే అవలంబిస్తుంది.
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ముడి పామ్ ఆయిల్ ధరలు స్థిరీకరించడానికి దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించడం కొరకు ముడి పామ్ ఆయిల్ దిగుమతి సుంకంపై విధివిధానాలను రూపొందించాలని, ఆయిల్ పామ్ రైతులను మరియు కంపెనీల ను కలుపుకుని Viability Gap Funding సూత్రాన్ని తిరిగి సమీక్షించి రైతులకు పామ్ ఆయిల్ గెలల ధర లాభసాటిగా ఉండేలా నిర్ణయించి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాత్యులు గారిని మంత్రి వర్యులు లేఖ ద్వారా కోరడమైనది.
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!