Tummala Nageswara Rao: ఎన్టీఆర్ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. తుమ్మల భావోద్వేగం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలువకు పూజలు చేసి పుష్పాభిషేకం చేశారు.. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి ప్రజానికం దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నారు.. దేవుడు లాంటి ఎన్టీఆర్ వల్ల వేంసూరు మండలంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు.
Read Also: Nirmala Sitharaman: ఏపీకి కేటాయింపుల్లో ప్రధానికి రెండో ఆలోచనే ఉండదు..!
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఇక, అసంపూర్తిగా ఉన్న కాలువ సీఎం కేసీఆర్ పాలనలో పూర్తిచేశాం అని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు.. తన జీవిత ఆశయం సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని.. సత్తుపల్లి మాదిరి పాలేరును కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. పాలేరులో సాగు నీటి కష్టాలు తీరాయి, జాతీయ రహదారులతో భూముల రేట్లు పెరిగాయన్న ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కొనసాగడం కోసం మీ దీవెనలతో, భద్రాద్రి రాముడి ఆశీస్సులతో చివరి శ్వాస వరకు నిలబడతా.. సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక, రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అంతకు ముందు సత్తుపల్లి పట్టణం నుండి లింగపాలేం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగపాలేం నుండి తుమ్మల బుల్లెట్ నడిపి తన అభిమానులను ఉత్సహపరిచారు.. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుండి ఎన్టీఆర్, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- Tags
- chandrababu
- cm kcr
- khammam
- ntr
- telangana
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!