Tummala Nageswara Rao: ఎన్టీఆర్ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. తుమ్మల భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలువకు పూజలు చేసి పుష్పాభిషేకం చేశారు.. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి ప్రజానికం దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నారు.. దేవుడు లాంటి ఎన్టీఆర్ వల్ల వేంసూరు మండలంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు.
Read Also: Nirmala Sitharaman: ఏపీకి కేటాయింపుల్లో ప్రధానికి రెండో ఆలోచనే ఉండదు..!
Also Read
ఇక, అసంపూర్తిగా ఉన్న కాలువ సీఎం కేసీఆర్ పాలనలో పూర్తిచేశాం అని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు.. తన జీవిత ఆశయం సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని.. సత్తుపల్లి మాదిరి పాలేరును కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. పాలేరులో సాగు నీటి కష్టాలు తీరాయి, జాతీయ రహదారులతో భూముల రేట్లు పెరిగాయన్న ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కొనసాగడం కోసం మీ దీవెనలతో, భద్రాద్రి రాముడి ఆశీస్సులతో చివరి శ్వాస వరకు నిలబడతా.. సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక, రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అంతకు ముందు సత్తుపల్లి పట్టణం నుండి లింగపాలేం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగపాలేం నుండి తుమ్మల బుల్లెట్ నడిపి తన అభిమానులను ఉత్సహపరిచారు.. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుండి ఎన్టీఆర్, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- Tags
- chandrababu
- cm kcr
- khammam
- ntr
- telangana
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!