Tummala Nageswara Rao: ఎన్టీఆర్ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. తుమ్మల భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. లింగపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలువకు పూజలు చేసి పుష్పాభిషేకం చేశారు.. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి ప్రజానికం దీవెనలతో ఈ స్థాయిలో ఉన్నారు.. దేవుడు లాంటి ఎన్టీఆర్ వల్ల వేంసూరు మండలంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు.
Read Also: Nirmala Sitharaman: ఏపీకి కేటాయింపుల్లో ప్రధానికి రెండో ఆలోచనే ఉండదు..!
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఇక, అసంపూర్తిగా ఉన్న కాలువ సీఎం కేసీఆర్ పాలనలో పూర్తిచేశాం అని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు.. తన జీవిత ఆశయం సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని.. సత్తుపల్లి మాదిరి పాలేరును కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. పాలేరులో సాగు నీటి కష్టాలు తీరాయి, జాతీయ రహదారులతో భూముల రేట్లు పెరిగాయన్న ఆయన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కొనసాగడం కోసం మీ దీవెనలతో, భద్రాద్రి రాముడి ఆశీస్సులతో చివరి శ్వాస వరకు నిలబడతా.. సత్తుపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక, రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారని ప్రకటించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అంతకు ముందు సత్తుపల్లి పట్టణం నుండి లింగపాలేం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగపాలేం నుండి తుమ్మల బుల్లెట్ నడిపి తన అభిమానులను ఉత్సహపరిచారు.. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుండి ఎన్టీఆర్, తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- Tags
- chandrababu
- cm kcr
- khammam
- ntr
- telangana
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!