TSTDC: భక్తులకు టీఎస్ టీడీసీ గుడ్ న్యూస్.. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఆ పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం అని హిందువుల నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు భక్తులు. అలానే పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడానికి కూడా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో టీఎస్ టీడీసీ భక్తులకు ఓ శుభవార్త చెప్పింది. శని ఆదివారాల్లో కార్తీకమాసం ట్రిప్స్ ని నిర్వహించనుంది. వివరాలలోకి వెళ్తే.. కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 5 యాత్రలు చేపట్టిందని.. దీనిలో భాగంగా తెలంగాణ లోని ప్రముఖ దేవాలయాల దర్శనం తో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కూడా ఉంటుందని తెలిపారు.
Read also:Dharmana Krishna Das: పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
Also Read
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
కాగా ఆహారం, అలానే ప్రవేశ టికెట్లకు అయ్యే ఖర్చులు ఎవరికీ వారు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల దర్శనం కోసం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరుతుందని తెలిపిన ఆయన తిరిగి మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దవాళ్లకు 4999 అలానే చిన్న పిల్లలకు 3999 అని వెల్లడించారు. అలానే శాతవాహన రీజియన్ పరిధి లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాల దర్శనానికి శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు బస్సు బయలు దేరుతుందని.. తిరిగి రాత్రి 10 గంటలకు బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు టికెట్ ధర పెద్దలకు 1999 కాగా చిన్నారులకు 1599 అని వెల్లడించారు. కాకతీయ రీజియన్ పరిధిలోని శైవ క్షేత్రాలతో పాటుగా ఇతర దేవాలయాల దర్శనానికి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు 9848540371, 9848007020, 9848306435, 9848007031, 9848125720 నెంబర్లను సంప్రదించాల్సిందగా కోరారు.
తాజావార్తలు
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!