పోచంపల్లి చేనేత కళాకారులు నిలువు పేకల మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పోచంపల్లి చేనేతకే కాకుండా ఈ ప్రాంతం భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది. అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఈ ప్రాంతం ప్రత్యేకత. ఇక్కత్ పట్టు వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్న చేనేత కళాకారులు.. ఆ వృత్తిపై ఆధారపడిన కార్మికులకు చేయూతనిచ్చి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి పథకాలను రూపొందిస్తామని తెలంగాణ…