Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ts Govt Announced 500 Gas Cylinder

CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?

Published Date :February 24, 2024 , 1:15 pm
By Bhanu
CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఫిబ్రవరి 27 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే ఈ పథకంలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రకారం… గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నిర్ణయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • TIMS Sanathnagar: సనత్‌నగర్‌ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం..!

కొత్త గ్యాస్ కనెక్షన్లకు 500 గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ అమలు చేస్తామన్నారు. గత మూడేళ్లలో లబ్ధిదారులు వినియోగించిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఖరారు చేస్తారు. ప్రస్తుతం 40 లక్షల మంది మహిళా లబ్ధిదారులను గుర్తించారు. వారితో ఈ నెల 27న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ సబ్సిడీ చెల్లింపులకు NPCI వేదికగా వ్యవహరిస్తుండగా, SBI నోడల్ బ్యాంక్. అయితే ఈ పథకం అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో పౌరసరఫరాల సంఘం సమావేశం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు అధికారులకు తెలియజేశారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆయిల్ కంపెనీల అనుమతి తీసుకోవాలన్నారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ మోసం చేసే అవకాశాలు ఉండడంతో… నేరుగా ఖాతాల్లోకే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read also: Begumpet Rail Station: మారనున్న బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు

లబ్ధిదారుల ఎంపిక ఇలా ఉంది..

మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వ పాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ఆశా వర్కర్ల సహకారంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆశా వర్కర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి రేషన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన వారి పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే రేషన్‌కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణలో దాదాపు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీరిలో 64 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతం రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు. మిగిలిన 26 లక్షల రేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు…వీరికి ఈ పథకం వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ సేకరణ తీసుకుంటే ఈ పథకం వర్తిస్తుంది.
German: గంజాయి వినియోగంపై జర్మన్ పార్లమెంట్ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు ఆమోదం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 500 gas cylinder
  • Gas cylinder Subsidy
  • gas subsidy
  • hyderabad
  • TS Govt

తాజావార్తలు

  • West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..

  • TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..

  • Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు

  • LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు

  • Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions