TS EAPCET Results 2024: ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ 10 లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS EAPCET Results 2024: తెలంగాణ TAP APSET-2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఉదయం జెఎన్టియుహెచ్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువ క్వాలిఫై అయ్యారని తెలిపారు. టాప్ 10 లో ఒకే అమ్మాయి 10th ర్యాంక్ సాధించిందన్నారు. ఇంజనీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారన్నారు. వచ్చే వారంలో అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ రెండు కన్నా ముందే ఎంట్రెన్స్ జరిగింది కాబట్టి.. ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు ఉంటాయన్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు అందరికీ సీట్లు ఉన్నాయి.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కంటే ఇంజనీరింగ్ లో అర్హత శాతం తగ్గిందన్నారు. అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్ లో లక్ష 432 మంది దరఖాస్తు చేసుకుంటే 91 వేల 633 మంది అనగా.. 91.24% హజరయ్యారన్నారని తెలిపారు. 82 వేల 163 మంది క్వాలిఫై.. 89.7 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.
Also Read
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
Read also: TS EAPCET Results 2024:ఎంసెట్ రిజల్ట్ ఫాస్ట్ గా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 2 లక్షల 54 వేల 750 మంది దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 40 వేల 618 మంది హాజరు… 94.45 శాతం హాజరయ్యారని వెల్లడించారు. లక్ష 80 వేల 424 మంది క్వాలిఫై , 75 శాతం క్వాలిఫై అయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లోనే భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ముందే సీట్లు భర్తీ చేసుకున్నట్టు పిర్యాదులు వస్తె కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనిధి, గురునానక్ కాలేజ్ ల (ప్రైవేట్ వర్సిటీ) పై సీరియస్ చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఎప్ సెట్ కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారన్నారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారని, ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తామన్నారు. ఎంసెట్ ఫలితాలు ఎన్టీవీ వెబ్ సైట్ లో https://ntvtelugu.com/telangana-eamcet-results-2024 క్లిక్ చేసి వేగంగా చూసుకోవచ్చు.
CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్.. ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!
తాజావార్తలు
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!