2023 TS Assembly Survey Polls: టీఆర్ఎస్కే మళ్ళీ పట్టం..ఓ సర్వే రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే టైం వుంది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ సర్వే ముందస్తు ఎన్నికల వేడిని మరింత పెంచేసిందని చెప్పాలి. ఒకవైపు వరదలతో బిజీగా వుంటే… ఆరా సంస్థ ఈ సర్వే ఫలితాలను హైదరాబాద్లో విడుదలచేసింది. ఈ సర్వే నివేదిక హాట్ టాపిక్ అవుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించామని సంస్థ తెలిపింది.
మొత్తం 119 స్థానాల్లో సర్వే నిర్వహించామని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను విడుదలచేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి అని సర్వే సంస్థ కుండబద్ధలు కొట్టింది. టీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. గతంలో రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితం కానుంది.
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి. కరీంనగర్ కోటపై టీఆర్ఎస్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ కారు జోరు కొనసాగించడం ఖాయం అంటోంది.
https://youtu.be/wDSNvKA7sYs
ఈ జిల్లాల్లో టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధిస్తాయంటోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. ఇక్కడ అత్యధికంగా 40.43 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ దే మళ్లీ గులాబీ గుబాళింపు.
అక్కడ టీఆర్ఎస్- 35.14, బీజేపీ-20.54, కాంగ్రెస్- 36.22, ఇతరులకు 8.10 శాతం ఓట్లు సాధిస్తుంది. అయితే ఇక్కడ ఓట్లు తగ్గుతాయంటోంది. 2018లో 46.87 శాతం ఓట్లను సాధించిన టీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో అయిదుశాతం ఓటుబ్యాంకును కోల్పోయిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కు 28.43 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019 లోక్సభలో ఈ సంఖ్య పెరిగింది. 29.78గా నమోదైంది. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు గాను 87 స్థానాల్లో టీఆర్ఎస్కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్-53, బీజేపీ-29 చోట్ల గట్టి అభ్యర్థులు ఉన్నారని సర్వే చెబుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!