2023 TS Assembly Survey Polls: టీఆర్ఎస్కే మళ్ళీ పట్టం..ఓ సర్వే రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే టైం వుంది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ సర్వే ముందస్తు ఎన్నికల వేడిని మరింత పెంచేసిందని చెప్పాలి. ఒకవైపు వరదలతో బిజీగా వుంటే… ఆరా సంస్థ ఈ సర్వే ఫలితాలను హైదరాబాద్లో విడుదలచేసింది. ఈ సర్వే నివేదిక హాట్ టాపిక్ అవుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించామని సంస్థ తెలిపింది.
మొత్తం 119 స్థానాల్లో సర్వే నిర్వహించామని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను విడుదలచేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి అని సర్వే సంస్థ కుండబద్ధలు కొట్టింది. టీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. గతంలో రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితం కానుంది.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి. కరీంనగర్ కోటపై టీఆర్ఎస్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ కారు జోరు కొనసాగించడం ఖాయం అంటోంది.
https://youtu.be/wDSNvKA7sYs
ఈ జిల్లాల్లో టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధిస్తాయంటోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. ఇక్కడ అత్యధికంగా 40.43 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ దే మళ్లీ గులాబీ గుబాళింపు.
అక్కడ టీఆర్ఎస్- 35.14, బీజేపీ-20.54, కాంగ్రెస్- 36.22, ఇతరులకు 8.10 శాతం ఓట్లు సాధిస్తుంది. అయితే ఇక్కడ ఓట్లు తగ్గుతాయంటోంది. 2018లో 46.87 శాతం ఓట్లను సాధించిన టీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో అయిదుశాతం ఓటుబ్యాంకును కోల్పోయిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కు 28.43 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019 లోక్సభలో ఈ సంఖ్య పెరిగింది. 29.78గా నమోదైంది. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు గాను 87 స్థానాల్లో టీఆర్ఎస్కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్-53, బీజేపీ-29 చోట్ల గట్టి అభ్యర్థులు ఉన్నారని సర్వే చెబుతోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!